వనభోజనాలలో డిస్టర్బ్ అయిన వసుధారా… ఉన్నపలంగా ఊరెళ్ళిపోయిన వసు!

గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొని ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే గౌతమ్ సారీ చెప్పమనడంతో ఇద్దరు లెక్చరర్స్ వెళ్లి వసుధారకు సారీ చెబుతారు. ఏదో గౌతమ్ సర్ చెప్పమన్నారు కాబట్టి చెబుతున్నాం లేకపోతే తనకు సారీ చెప్పడం ఏంటి అంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇక వసుధార అదే ధ్యాసలో ఉండి బాధపడుతూ ఉంటుంది.ఇక మినిస్టర్ గారు రావడంతో రిషి వెళ్లి మినిస్టర్ ని కలుస్తాడు అనంతరం ధరణి వసుధారని తీసుకొని వెళ్లగా మినిస్టర్ ఏం మాట్లాడినా వసుధార మౌనంగా ఉంటుంది.

ఆ సమయంలో గౌతమ్ అక్కడికి వచ్చి నువ్వు ఇలాగే ఉన్నావంటే రిషికి డౌట్ వస్తుంది అని చెప్పడంతో ఇక వన భోజనాలు కార్యక్రమంలో ఆటపాటలతో వసుధార సరదాగా గడుపుతుంది. తాడు లాగే ఆటలో అమ్మాయిలు ఒకవైపు అబ్బాయిలు ఒకవైపు ఉండి తాడు లాగుతుండగా రిషి గట్టిగా లాగడంతో వసుధార వచ్చి తన ఒడిలో పడుతుంది. ఇద్దరు అలాగే ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ ఉండిపోతారు. ఇక మిగతా అందరూ క్లాప్స్ కొట్టడంతో వసుధారా రిషి దగ్గర నుంచి పక్కకు వెళుతుంది.

ఇలా వీరందరూ గేమ్స్ ఆడుతుండగా మినిస్టర్ పిఏ వచ్చి భోజనాలు తయారయ్యాయని చెప్పడంతో అందరూ కలిసి భోజనాలకు వెళ్తారు. ఇక అక్కడ కూడా వసుధారా ఏం మాట్లాడకుండా అదే ఆలోచనలో ఉండే భోజనం కూడా చేయదు దీంతో రిషి తను ఏదో మూడ్ ఆఫ్ లో ఉందని అసలు ఏం జరిగింది అని అంటాడు. ఇక ఏం కాలేదు సార్ అంటూ వసుధార చెప్పకుండా దాచేస్తుంది.

ఇంటికి వెళ్లిన తర్వాత వసుధర జగతి మేడంతో జరిగినది మొత్తం చెబుతుంది. ఎందుకు మేడం వాళ్లకు నేనంటే అంత శత్రుత్వం ఎందుకు ఇలా మాట్లాడుతారు అని బాధపడగా కొందరు మనుషులు అంతే వసుధారా అవకాశం దొరికితే చాలు గుండెల్ని కోసేసేలాగా మాట్లాడతారు వారికి ఎలాంటి శత్రుత్వం అవసరం లేదు అంటూ జగతి ఓదారుస్తుంది.నువ్వు వెంటనే మీ అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి కొద్ది రోజుల్లో అక్కడుండి రా అని వసుధారకు జగతి సలహా ఇస్తుంది.