బిగ్ బాస్ హౌస్ లో మొదలైన లవ్ ట్రాక్..సూర్య, ఆరోహి ప్రేమ బంధం బలపడుతుందా?

దేశంలో నంబర్ వన్ రియల్లీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు సీజన్ సిక్స్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ షోలో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో బుల్లితెర జోడి మెరీనా రోహిత్ కూడా కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. అయితే ప్రతిసారి బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్లుగా పాల్గొనే కంటెస్టెంట్లు కొంతమంది ఒకరికి ఒకరు పరిచయం లేకపోయినా కూడా బిగ్ బాస్ వల్ల స్నేహితులుగా, ప్రేమికులుగా మారిపోతున్నారు.

ఇలా గడిచిన 5 బిగ్ బాస్ సీజన్లలో ఎంతోమంది స్నేహితులుగా మారిపోయారు. ఇక ఈ సీజన్ సిక్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా దాదాపు ఒకరికొకరు పరిచయం లేని వారు. అయితే ఈ సీజన్ లో పాల్గొన్న ఆర్జే సూర్య, ఆరోహి రావు మాత్రం బిగ్ బాస్ హౌజ్ లోకి రాకముందే మంచి స్నేహితులు. వీరిద్దరూ టీవీ9 లో పనిచేస్తున్నారు. స్నేహితులుగా హౌస్ లోకి ప్రవేశించిన వీరిద్దరూ అదే స్నేహాన్ని కంటిన్యూ చేసుకుంటారా? లేదా ? అన్నది వారిష్టం.

అయితే ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి మాటలు కరువయ్యాయి. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఆరోహి గురించి సూర్య కంప్లైంట్ చేశాడు. దీంతో ఆరోహి నువ్వు కూడా ఒక కంటెస్టెంట్ అని అర్థమవుతుందని చెప్పి అతనికి మాట్లాడకుండా బెట్టు చేసింది. అంతే కాకుండా సూర్య మైక్ కూడా కనిపించకుండా దాచేసింది. అయితే ఆరోహీ తన మైక్ దాచేసిందని తెలిసినా కూడా సూర్య ఆమెను మైక్ గురించి అడగలేదు. ఇలా కొంత సమయం మాట్లాడుకోకుండా ఉన్న ఇద్దరు ఆ తర్వాత ఫన్నీగా పోట్లాడుతూ చివరికి ఒకటయ్యారు. ఈ క్రమంలో సూర్య ఆరోహికి ఐ యామ్ సారీ.. ఐ లవ్యూ అని చెప్పాడు. దీంతో వీరిమధ్య ప్రేమ మొదలైందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ముందు ముందు వీరి ప్రేమ బంధం బలపడుతుందా? లేక స్నేహితులుగా ఉండిపోతారో చూడాలి మరి.