తులసి విషయం తెలిసి ఆసుపత్రికి పరుగులు పెట్టిన కుటుంబ సభ్యులు….. భర్తగా సామ్రాట్ సంతకం చూసి షాక్ లో నందు!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే…లాస్య నందు ఇద్దరూ కూడా ఇంటికి వచ్చి త్వరలోనే తాము కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నామని పరంధామయ్యతో పాటు పిల్లలకు కూడా చెబుతారు. అయితే ఈ విషయం విన్నటువంటి పరంధామయ్య బిజినెస్ చేయండి కానీ అత్యాశకు పోకండి అంటూ చెబుతాడు. ఇప్పుడు నీ పర్సులో వంద రూపాయలు కూడా లేవు లక్షలు పెట్టుబడి పెట్టి ఎలా బిజినెస్ చేస్తావు అని పరంధామయ్య అడగడంతో పెట్టుబడికి లాస్య ఫ్రెండ్ సహాయం చేస్తానని చెప్పింది సంవత్సరంలోగా చేస్తామని చెప్పడంతో నీకు నమ్మకం ఉంటే ఓకే అని పరంధామయ్య చెబుతాడు.

అంతలోగా సామ్రాట్ పరంధామయ్య కు ఫోన్ చేసి తులసి హాస్పిటల్ లో అడ్మిట్ అయిన విషయాన్ని చెప్పడంతో కంగారుపడి అందరూ కూడా హాస్పిటల్ కి పరుగులు పెడతారు.అంతలోపే తులసి తల్లి తమ్ముడు హాస్పిటల్ కి వెళ్లి ఏమైంది అంటూ డాక్టర్లను ఆరాతీయగా తనకు లో బీపీ కావడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. పెరాలసిస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వ్యక్తి పట్ల ఇలా అశ్రద్ధ వహిస్తే ఎలా అంటూ మండిపడుతుంది. అంతలోపే తులసి కుటుంబ సభ్యులు వెళ్లిమా అమ్మకు ఎలా ఉంది సామ్రాట్ గారు అని ప్రేమ్ అడగడంతో చావు బతుకుల మధ్య కొట్టుకుంటుంది వెళ్లి చూడండి రా అంటూ దీపక్ ఆవేశపడతారు.

ఇప్పుడు మీరు మీ అమ్మకు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా కోమా లేదా పెరాలసిస్ అంటూ మండిపడతాడు. అయితే దీపక్ మాటలు విన్నటువంటి లాస్య తులసి మాజీ మొగుడు నోరు మూసుకొని ఉన్నాడు. మధ్యలో ఈ వ్యక్తి గోల ఏంటి అని అనుకుంటుంది.ఇక తులసి ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం జరుగుతుంది. ఇంతలోపే డాక్టర్ వచ్చి తనకు అవుట్ ఆఫ్ డేంజర్ ఎలాంటి ప్రాణాపాయం లేదు అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అంతలోగా నర్స్ వచ్చి మీరు తులసి గారు భర్త కదా మీతో డాక్టర్ మాట్లాడాలి వెళ్ళండి అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

ఇలా తులసి భర్తగా సామ్రాట్ సంతకం చేశారని తెలుసుకున్నటువంటి లాస్య ఇప్పుడు వీరిద్దరిని ఏమంటారు అనండి అంటూ మరిన్ని పుల్లలు పెట్టేకి ప్రయత్నం చేస్తుంది.దీంతో ఇప్పుడు కూడ మీరు సామ్రాట్ గారిని ఏమి అనకపోవడం ఏం బాగోలేదు నాన్న అంటూ నందు మాట్లాడుతారు.దీంతో తులసి తమ్ముడు దీపక్ నా అక్క గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు ఒక బజారు మనిషివి అంటూ లాస్యని అనడంతో నందు సీరియస్ అయ్యి దీపక్ పై చేయి చేసుకుంటారు. ఇలా తన కొడుకుని కొట్టడంతో సరస్వతి సైతం నందు అంటూ గట్టిగా నందు పై సీరియస్ అవుతుంది. మరి తర్వాత ఎపిసోడ్ లో ఈ సీరియల్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.