ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవటంతో సుమ షోలో సందడి చేసిన బ్రహ్మాస్త్ర టీమ్..?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, మౌని రాయ్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వటంతో తెలుగులో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుండటంతో ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయ్యింది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం వేరే దారులను ఎంచుకుంది. ఈ క్రమంలో ఇప్పటికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. అలాగే ఆలియా భట్ కూడా తెలుగులో అద్భుతంగా పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తెలుగు ప్రేక్షకుల కోసం రణబీర్ కపూర్ కూడా తెలుగులో అద్భుతంగా మాట్లాడాడు.

ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయడంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంలో ఈ సినిమా యూనిట్ సందడి చేయనుంది. ఈ ప్రోగ్రాంలో ఆర్యభట్ట రాజమౌళి మౌని రాయ్ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో ఇటీవల పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 10వ తేదీన ఈటీవీలో ప్రసారం కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.