సుధీర్ ని నేను పిలవకపాయిన వస్తాడు.. అదే మా మధ్య ఉన్న బాండింగ్..రష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బుల్లితెర లవబుల్ జోడి అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుధీర్- రష్మీ. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వీరిద్దరూ.. ప్రేమికులుగా మరింత పాపులర్ అయ్యారు. అయితే వీరిద్దరి ప్రేమ కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే అని తెలిసినా కూడా ప్రేక్షకులు ఇప్పటికీ వీరి మధ్య ఏదో అనుబంధం ఉందని బలంగా నమ్ముతున్నారు. ఇక ఇటీవల నందు హీరోగా నటించిన బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ సినిమాలో రష్మీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా రష్మీ చాలా కాలం తర్వాత మంచి హిట్ అందుకుంది. నవంబర్ 4వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటిరోజు నుండే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది.

ఇక సినిమా హిట్ అయినందుకు ఇటీవల నందు, రష్మీ ఇద్దరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా సుధీర్ గురించి రష్మి కి యాంకర్ ఒక ప్రశ్న వేశాడు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సుధీర్ హాజరయ్యాడు. సుధీర్ ని మీరు పిలిచారా? అంటూ యాంకర్ రష్మీ ని ప్రశ్నించాడు. దీంతో రష్మీ స్పందిస్తూ.. పిలవాల్సిన అవసరం నాకు లేదు. నేను పిలవకపోయినా కూడా తాను వస్తాడు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అటువంటిది.

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ప్లేస్ అన్ని సుధీర్ కి తెలుసు అందుకే నేను పిలవకపోయినా కూడా తాను ఈవెంట్ కి వస్తాడని నాకు తెలుసు. అయితే ఈ ఈవెంట్ కి సుధీర్ ని నందు పిలిచాడు. నందు సుధీర్ మద్య అంత బాండింగ్ లేదు కాబట్టే ఫార్మాలిటీ కోసం నందు సుదీర్ ని ఈవెంట్ కి పిలిచాడు. కానీ నాకు ఆ అవసరం లేదు సుధీర్ తప్పకుండా ఈవెంట్ కి రావాల్సిందే … వస్తాడని నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇలా ఇద్దరిమద్య ఉన్న బాండింగ్ గురించి రష్మి ఇలా చెప్పటంతో వీరి రిలేషన్ గురించి వస్తున్న వార్తలలో నిజముందని తెలుస్తోందంటు కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.