ఇంద్రుడు చంద్రమ్మ పై అనుమానపడుతున్న సౌర్య…. డాక్టర్ బాబు నిజస్వరూపం తెలుసుకున్న దీప!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయానికి వస్తే దీపకు చంద్రుడు కనిపించడంతో తనని వెంబడిస్తారు. అతను తప్పించుకోవడంతో దీప చాలా బాధపడుతుంది.ఇక కార్తీక్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నేను తర్వాత వస్తానని చెప్పి దీపను పంపిస్తాడు కార్తీక్ చంద్రుడు కోసం తిరిగి అదే హోటల్లో వెయిట్ చేస్తాడు. మరోవైపు దీపా ఇంటికి వచ్చి పండరీతో జరిగిన విషయం మొత్తం చెబుతుంది. కార్తీక్ బాబుకు బిడ్డను వెతకడం ఇష్టం లేదని మీకు ఎలా చెప్పాలి అని పండరి మనసులో అనుకుంటుంది.

మరోవైపు హోటల్లో కార్తీక్ చంద్రుడు ఇద్దరు మాట్లాడుకుంటూ సౌందర్య రావడం శౌర్య వెళ్ళనని చెప్పడం అన్ని విషయాలను చెప్పేస్తాడు.ఇక శౌర్య అన్నమాటలను గుర్తుచేసుకొని సౌందర్య బాధపడుతుంది. శౌర్య ఎందుకు రానంటుంది ఇంద్రుడు కూడా కొద్ది రోజులు ఆగండి అన్ని పనులు జరుగుతాయి అని ఎందుకు అన్నాడు అక్కడ పరిస్థితులు చూస్తుంటే నాకు ఎన్నెన్నో అనుమానాలు వస్తున్నాయని మాట్లాడుకుంటూ ఉంటారు.ఆ మోనిత లోపల ఉన్న బయట చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. బహుశా ఇంద్రుడు కూడా మోనిత మనిషేనా అని అనుమాన పడుతుంది.

దీప పండరి ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అక్కడికి చారుశీల కార్తీక్ ఇద్దరు వస్తారు. త్వరగా జ్యూస్ తాగు దీప నీకు ఇంజక్షన్ వేయాలని చారుశీల అనడంతో నాకు ఏ రోగం లేదని అన్నయ్య చెబుతుంటే మీరు ఎందుకు మందులు ఇస్తున్నారని దీప ప్రశ్నిస్తుంది.దీంతో చారుశీల అనుమాన పడి దీప తన రిపోర్ట్స్ ఎవరికైనా చూపించిందా అనుకొని నువ్వు కార్తీక్ ని నమ్మడం లేదా దీప అనడంతో దీప నేను నమ్మడం లేదు అని సమాధానం చెబుతుంది.ఇంద్రుడిని పట్టుకోవడం లేదు శౌర్యని వెతకడం లేదు అని దీప అనడంతో నేను తనని వెతుకుతూనే ఉన్నానని చెప్పినా దీప వినదు.

ఇవన్నీ చూసిన చారుశీల నువ్వు ఇంకా కార్తీక్ పై నమ్మకం కోల్పోవాలి. అప్పుడే మృత్యువుకు దగ్గర అవుతావు. అంటూ తన మనసులో అనుకుంటుంది. శౌర్య అంటే కనిపించలేదు మరి అత్తయ్య వాళ్ళ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లలేదు అక్కడ మరొక బిడ్డ కూడా అల్లాడిపోతుంది కదా ఇప్పుడే నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంటూ దీప గొడవ చేస్తుంది. ఇక సౌర్య నిద్రపోతూ ఉండగా తన కలలో తన తల్లికి బాగాలేదని కల రావడంతో వెంటనే లేస్తుంది.అమ్మకు బాగాలేదని కల వచ్చింది బాబాయ్ అమ్మకు బాగా లేకపోయినా పని చేస్తూ ఉంటుందని శౌర్య చెప్పడంతో పక్కనే మీ నాన్న ఉన్నారు కదా ఎందుకు బాధ పడతావు అంటూ ధైర్యం చెబుతారు.

పక్కనే మా నాన్న ఉన్నారనీ మీకు ఎలా తెలుసు మీరు కనుక మా అమ్మ నాన్నలను చూశారా అంటూ వారిద్దరిని అనుమాన పడుతుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకుంటారు. మరుసటి రోజు ఇంద్రుడిని ఎలాగైనా వెతకాలని అతనుకనిపించిన హోటల్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ ఇంద్రుడు కార్తీక్ ఇద్దరు మాట్లాడుతూ కూర్చుని ఉండడం దీప చూస్తుంది. కార్తీక కూడా దీప ని చూసి షాక్ అవుతారు.దీంతో దీప మరొక మాట మాట్లాడకుండా తనని డాక్టర్ బాబాయ్ మోసం చేస్తున్నారని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.