బాలయ్య అన్ స్టాపబుల్ 2 కోసం స్టార్ హీరోలు లేరా… మరీ ఈ హీరోలను కూడా ఆహ్వానిస్తున్నారా?

బాలకృష్ణ హీరోగా వెండి తెరపై తన విశ్వరూపం చూపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఎంతో గుర్తింపు పొందిన బాలకృష్ణ వ్యాఖ్యాతగా కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ అద్భుతమైన మాటతీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఊహించని స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ సీజన్ కి మించి ఉండేలా రెండవ సీజన్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సీజన్ అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న పోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నో అంచనాల నడుమ ఈ సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.

బాలయ్య ఈ సీజన్లో ఏకంగా మీడియం రేంజ్ హీరోలను కూడా ప్రశ్నించబోతున్నారని సమాచారం. ఈ కార్యక్రమంలో విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇది తెలిసినటువంటి అభిమానులు బాలయ్య షో కోసం పెద్ద హీరోలు లేరా అందుకే ఇలాంటి వారిని ఆహ్వానిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. బాలయ్య ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వంటి వారిని కూడా తీసుకురావచ్చు కదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ తో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బాలయ్య ఇష్టపడటం లేదని వార్త కూడా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఈ కార్యక్రమంలో బాలయ్య ఇలా మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.