తులసి మాటలు విని లాస్యకు క్షమాపణ చెప్పిన నందు…. మారినట్టు నటిస్తున్న లాస్య!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే….నందు లాస్య మధ్య జరిగిన గొడవలను సర్దుమనిగేలా చేసివారిని దగ్గర చేయడం కోసం తులసి నందుతో మాట్లాడుతుంది. నందు మాట్లాడుతూ తనకు లాస్య పట్ల ప్రేమ లేదని చెప్పడంతో ప్రేమ ఉందనే కదా పెళ్లి చేసుకున్నారు అంటూ తులసి మాట్లాడుతుంది. ఈ ఇంటిని ఎప్పుడైతే మోసం చేసి రాయించుకుందో తనపై అప్పుడే ప్రేమ తగ్గిపోయింది అని నందు చెబుతాడు.

తనకు సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇల్లు రాయించుకున్నానని చెప్పింది కదా అంటూ తులసి చెబుతుంది. అది తన జబ్బు తను ఎప్పటికీ మారదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. తన వల్ల పిల్లల ప్రేమకి దూరమయ్యాను పిల్లల ముందు హీరోగా ఉండే తాను జీరో అయ్యాను అంటూ నందు చెబుతాడు. ఆ మాటలకు తులసి మాట్లాడుతూ లాస్య కూడా ఎన్నో భరించింది. ఇప్పటికే మన గొడవలు చూసి పిల్లలు అలసిపోయారు. ఇప్పుడు మీ గొడవలు చూస్తూ విసిగిపోతున్నారు. లాస్య గురించి ఆలోచించండి అని చెప్పి బయటకు వెళుతుంది.

నందు కూడా తులసి వెనకే వస్తూ ఏదో పిల్లలతో ఇక్కడికి సరదాగా గడపాలని వస్తే ఇక్కడ కూడా మనశ్శాంతి లేదు ఇకపై నువ్వు వచ్చినప్పుడు ఇలాంటి గొడవలు లేకుండా ఉండేలా చూస్తానని చెబుతాడు. ఇలా నందు మాటలకు తులసి సంతోషపడుతుంది.అత్తయ్య వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్త అని తులసి చెప్పగా నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త అంటూ నందు చెప్పడంతో అక్కడి నుంచి తులసి సంతోషంగా వెళ్లిపోతుంది.ఇక తులసి లాస్య వద్దకు వెళ్లిన నందు అక్కడ గదిలో పడి ఉన్న సామాన్లు అన్నింటిని సర్దుతూ లాస్యకు సారీ చెబుతాడు. లాస్య కూడా సారీ అంటూ తనని హగ్ చేసుకుంటుంది.

ఇక తులసి లాగే ఇంట్లో వారందరి ప్రేమాభిమానాలను పొందు జాగ్రత్తగా ఉండు అని చెప్పి నందు వెళ్లిపోగా లాస్య మాత్రం ఈ ఇంటిని నా చేతుల్లో చిక్కించుకొని మిమ్మల్ని అందరిని రోడ్డుకీడుస్తాను. నేనునిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి మారినట్లు నటించాను. లోపల నా ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఉంది అంటూ లాస్య మారినట్టు నటిస్తుంది.మరోవైపు తులసి తన బాధలు భావోద్వేగాలన్నింటిని డైరీలో రాసుకొని తన తల్లికి ఫోన్ చేసి తన బాధను పంచుకుంటుంది. అలాగే హనీ కోసం సామ్రాట్ ఎన్నో బొమ్మలు తెచ్చిన తను డల్ గా ఉండడంతో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడగా తనకు ఎగ్జామ్స్ లో ఫస్ట్ ర్యాంకు రావాలని చెబుతుంది.