మరో గీతులా మారిపోయిన శ్రీ సత్య… ఎలిమినేషన్ తీసుకోని ఇంటికెళ్ళి కూర్చో అంటూ కామెంట్స్?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో కి తెలుగు ప్రేక్షకుల నుండి లభిస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు తెలుగులో ఐదు బుల్లితెర సీజన్లతో పాటు ఒక నాన్ స్టాప్ సీజన్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇటీవల ఆరవ సీజన్ కూడా ప్రారంభమైంది. ఇక ఇన్ ఆరవ సీజన్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. ఇప్పటివరకు 8 వారాలు పూర్తిచేసుకుని ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న గీతు రాయల్ ప్రవర్తన ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులకు కూడా నచ్చటం లేదు.

ఎదుటివారు ప్రాణాలు పోయినా సరే తన పంతం నెగ్గించుకోవాలని పట్టుదలతో ఎంతటి దారుణానికైనా దిగజారుతూ ఎదుటివారి ఎమోషన్స్ తో ఆటలాడుతూ ఉంటుంది. ఇలా తన ప్రవర్తనతో ఇంటి సభ్యులను ఇబ్బంది పెడుతున్న గీతు లాగే శ్రీ సత్య కూడా దారుణంగా ప్రవర్తిస్తోంది. ఇటీవల జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో సూర్య వెళ్లిపోయాడని అతని ప్లేట్ కోసం ఇనయా వెతకగా ఆ ప్లేట్ మీద ఉన్న పేరు చేరిపేసారని రేవంత్ చెబుతాడు. దీంతో నేను ఆ ప్లేట్ లో తింటున్నానని తెలుసు కదా .. ఎందుకు చేరిపేసారు అంటూ అందరిమీదా అరిచింది.

ఆ తర్వాత నాకు ఈ ఇంట్లో తినాలని లేదు అంటూ పక్కకి వెళ్లి కూర్చుంది. దీంతో ఫైమా వచ్చి బ్రతిమిలాడినా కూడా నువు నా ఫ్రెండ్ కాదని చెప్పటంతో ఫైమా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మెరీనా వచ్చి ఇనయాని బ్రతిమలాడి భోజనం తినిపించింది. ఆ సమయంలో శ్రీ సత్య ఊరుకోకుండా… సూర్య వెళ్లిపోయాడని అంత బాధ పడుతుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ తీసుకొని అతని ఇంటికి వెళ్ళి కూర్చోమను…అంటూ దారుణంగా మాట్లాడింది. ఇలా గీతుతో కలసి తిరుగుతూ.. సత్య కూడా మరో గీతు లాగా తయారయ్యిందని ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా మండిపడుతున్నారు.