Jetlee Movie: జెట్లీ అందరినీ ఎంటర్టైన్ చేసే కామెడీ థ్రిల్లర్, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది: నిర్మాత చెర్రీ

Jetlee Movie: టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చెర్రీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

డైరెక్టర్ రితేష్ గారు ఈ కథ చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటి?

ఇది పూర్తిగా డిఫరెంట్ సబ్జెక్ట్. దాదాపు 80 శాతం సినిమా ఫ్లైట్‌లోనే జరుగుతుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక సినిమా అంతా ఫ్లైట్‌లో జరిగినట్లు లేదు. రితేష్ ఎప్పుడూ డిఫరెంట్ కథలతో వస్తాడు. తను కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది.

మా మధ్య మంచి అనుబంధం ఉంది. అతన్ని మా అబ్బాయిలా చూస్తాను. తనకీ కృతజ్ఞత వుంటుంది. తను చెప్పే కథల్లో చాలా వరకు నాకు నచ్చుతాయి. తనతో పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

మైత్రి మూవీ మేకర్స్‌ బిగ్ సినిమాస్ చేస్తుంటారు.. మీరు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు కదా… మీ ప్లాన్ ఎలా వుంటుంది?

-మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యానర్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణం. ఆ బ్యానర్‌లో ప్రొడక్షన్ చూసుకోవడం గర్వంగా ఉంది. మైత్రీలో పెద్ద కాంబినేషన్స్‌తో సినిమాలు వస్తున్నాయి.

-నాకు చిన్న సినిమాలు, ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంటుంది. ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ తక్కువగా ఉండే కథలను ఎంచుకుంటూ ‘మత్తు వదలరా’, ‘హ్యాపీ బర్త్‌డే’, ‘మీటర్’, ‘జెట్లీ’ సినిమాలు చేశాం. ‘హ్యాపీ బర్త్‌డే’, ‘మీటర్’ థియేటర్లలో ఆశించినంతగా ఆడకపోయినా, కమర్షియల్‌గా మంచి రిజల్ట్ ఇచ్చాయి.

జెట్లీ సినిమాను ముందుగా పెద్ద హీరోతో చేయాలనుకున్నారట?

-మొదట ఈ సినిమాను సీరియస్ థ్రిల్లర్‌గా చేయాలనుకున్నాం. కథ డెవలప్ చేశాం. కొంతమంది హీరోలకు చెప్పినా, వారికి తగ్గట్టుగా ఈ కథ కుదరలేదు. ఇది రెగ్యులర్ హీరో సినిమా కాదు. అందుకే రితేష్ దీన్ని కామెడీ థ్రిల్లర్‌గా మార్చాడు.

-ఈ కథలో కొన్ని సన్నివేశాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అవి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్ చేస్తేనే బాగా పండుతాయి. సత్యకు కథ చెప్పినప్పుడు ‘నేను హీరోనా’ అని మొదట కొంచెం ఆలోచించాడు. కానీ డైరెక్టర్ వివరంగా చెప్పిన తర్వాత ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో అందరికీ సమాన ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు ఉంటాయి. యాక్షన్ కూడా సినిమాటిక్ లిబర్టీతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.

రియా సింఘా గురించి?

రియా సింఘా చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుంటుంది. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది.

సినిమాల విషయంలో మీ జడ్జ్‌మెంట్ ఎలా ఉంటుంది?

ఆడియన్స్‌కు ఏది నచ్చుతుందో ముందుగా ఎవరూ చెప్పలేరు. కానీ మనం కథ ఎంచుకునేటప్పుడు కొత్తదనం ఉండేలా చూసుకోవచ్చు. కథ కొత్తగా వుంటే రిస్క్ తీసుకుని ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు.

కాల భైరవ మ్యూజిక్ గురించి?

రితేష్ తన మొదటి సినిమా నుంచి అదే టెక్నీషియన్స్‌తో పనిచేస్తున్నాడు. వాళ్లందరూ ఒకే వేవ్‌లెంగ్త్‌లో ఉంటారు. అందుకే అతనికి కావాల్సిన అవుట్‌పుట్ వస్తుంది. ఈ సినిమాకు కూడా అందరూ అద్భుతంగా పని చేశారు.

ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంది?

సినిమా చూశాం. చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఒక మంచి కామెడీ థ్రిల్లర్. కామెడీ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, అజయ్… ఇలా అన్ని పాత్రలు బాగా అలరిస్తాయి.

కామెడీ సినిమా అంటే కేవలం నవ్వులు కాదు… మంచి కథ కూడా ఉండాలి. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.

కొత్తగా చేయబోయే సినిమాలు?

– రితేష్‌తో ఒక హారర్ సినిమా చేయబోతునాను. ఆ తర్వాత ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుంది. మరో ముగ్గురు దర్శకులు కథలు చెప్పారు, వాటికి కొంచెం సమయం పడుతుంది.

Vijay Thalapathy Give A Big Shock To DMK | Stalin | Telugu Rajyam