కార్తీక్..దీప దూరం చేసే పనిలో మోనిత…. పండరి మోనిత మనిషేనా?

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న కార్తిక దీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…హాస్పిటల్లో పేపర్ చదువుతూ కూర్చున్న సౌర్య దగ్గరకు వెళ్లి చదువుకుంటావా అని చెప్పడంతో అమ్మానాన్నల దగ్గరకు వెళ్లిన తర్వాతే తాను చదువుకుంటానని సమాధానం చెబుతుంది.డాక్టర్ నీకు తెలుసా పిన్ని అని సౌర్య అడగడంతో గతంలో నేను తన ఇంట్లో పని చేశాను అయితే వారింట్లో దొంగతనం చేయడంతో ఆమె అవసరమైతే డబ్బులు అడగండి కానీ ఇలా దొంగతనం చేయద్దు అన్నారని చంద్రమ్మ చెప్పడంతో ఆమె చాలా మంచి మనిషిలా ఉన్నారు తనతో స్నేహం చేసి మా నాన్న ఎక్కడున్నా వెతుకుతాను అని సౌర్య చెబుతుంది.

హోటల్ గదికి చేరుకున్న సౌందర్య ఆనందరావుకి ఫోన్ చేసి ఎక్కడ వెతికిన దీపా వాళ్ళు కనిపించలేదు అని చెబుతుంది అతనితో మాట్లాడే ఫోన్ పెట్టేసిన అనంతరం అసలు మీరు ఉన్నారా లేదా ఉంటే ఎక్కడున్నారు అంటూ సౌందర్య ఆలోచనలలో పడుతుంది.దీపా కార్తిక్ గురించి ఆలోచిస్తూ సౌందర్య పిచ్చిదాని లాగా రోడ్డు వెంట తిరుగుతూ వారిని వెతుకుతూ ఉంటుంది. మరోవైపు దీప గతంలో తాను సౌర్యతో కలిసి గడిపిన క్షణాలన్నింటినీ గుర్తు చేసుకుని బాధపడుతుంది. అలాగే కార్తీక్ కూడా నా జీవితంలోకి ఏ క్షణాన వచ్చావో తెలియదు కానీ వచ్చిన మరుక్షణం నుంచి నీకు అన్ని కన్నీళ్లే అంటూ బాధపడుతూ ఉంటారు .

దీప కూడా సౌర్య గురించి తలుచుకొని బాధపడుతూ ఉండగా నువ్వు అసలు టెన్షన్ పడకూడదు అంటూ దీపను ఓదారుస్తాడు కొద్దిసేపటికి దీప నిద్రపోతూ ఉంటుంది పండరీ తనని నిద్ర లేపడానికి వెళ్తే లేవదు అంతలో కార్తీక్ వచ్చి తనని నిద్ర లేపగా లేపకండి మీకేం కావాలో నేనే చేసి పెడతానని చెబుతుంది. కార్తీక పండరితో మాట్లాడుతూ నీకు ఎంతమంది పిల్లలు అని అడగ ఆమె సమాధానాలు చెప్పదు దాంతో కార్తీక్ సందేహం వ్యక్తం చేస్తాడు. మరోవైపు అంజి ఓ వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా సౌందర్య వచ్చి కార్ తీయమంటుంది.తను నీకు తెలుసా అని అడగగా ఈ ఊరిలో ప్రతి అణువు తనకు తెలుసు అదంతా ఒక పెద్ద కథ చెబుతానని అంజి చెబుతాడు దీప పోచలు ఎక్కువ చేస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుడికి వెళ్లి దీపను వెతుకుదాం అంటూ సౌందర్య వెళుతుంది.

మరోవైపు పండరి కూరగాయ ముక్కలను కట్ చేసి వాటిపై తేనె వేసి దీపకు ఇస్తుంది ఇప్పటికే ఒక డాక్టర్ తో వేగలేక పోతున్నానంటే మరి నువ్వు కూడా ఇలాగే తయారయ్యావా ఇప్పుడు నాకేం బాగాలేదని ఇలా పెడుతున్నారు అంటూ దీప మాట్లాడుతుంది. దీప కార్తిక్ తో మాట్లాడుతూ మీకు గతం గుర్తు లేనప్పుడే సౌర్య గురించి ఆలోచించారు. గతం గుర్తొచ్చిన తర్వాత ఎందుకు ఆలోచించలేదు అని దీపా అడగడంతో నువ్వు ఆలోచించొద్దు అని చెప్పాను కానీ నేను ఆలోచించలేదని చెప్పలేదు కదా అంటూ తనని ఓదారుస్తాడు.

మరోవైపు శౌర్య చారుశీల దగ్గరకు వెళ్తూ ఉంటుంది అయితే సౌర్య తన వద్దకు రావడం చూసినా చారుశీల కంగారు పడుతుంటుంది.అయితే తర్వాత ఎపిసోడ్ లో సౌర్య ఫోటోని పండరికి చూపించగా వీళ్ళు మా ఇంటి పక్కనే నేను చూపిస్తాను ఆటోలో తీసుకెళ్తుంది. అయితే పండరి నిజంగానే చారుశీల పంపించిన మనిషా లేక మోనిత పంపించిన మనిషా మౌనిత మరోసారి దీప కార్తికులను విడగొట్టే ప్రయత్నం చేస్తుందా అని సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.