ఇంటిని తన పేరు మీదకు మార్చుకొని అందరికీ షాక్ ఇచ్చిన లాస్య.. షాక్ లో తులసి!

కుటుంబ కథ నేపథ్యంలో బుల్లితెరపై ప్రసారమవుతు ప్రేక్షకులను సందడి చేస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరగనుంది అనే విషయానికి వస్తే.. ఇంటి నుంచి పరంధామయ్య వెళ్లిపోవడంతో నందు ఇంట్లో ఉన్న వారందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.తన తండ్రి లేని ఇంటిలోకి నువ్వు కూడా అడుగు పెట్టడానికి వీలు లేదు అంటూ తన తల్లిని కూడా బయటకు తోసేస్తాడు . నాన్నను తీసుకొని నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టు అంటూ చెప్పగా అనసూయ నేను ఎంత నచ్చచెప్పిన మీ నాన్న వినలేదు నేనే కాదు తులసి చెప్పిన కూడా వినలేదు అంటుంది.

నాకు ఎవరి మాటలు వినే సహనం లేదు కేవలం మా నాన్న నా ఇంట్లో అడుగు పెట్టాలి అంతే అంటూ అందరిపై ఆగ్రహం వ్యక్తం చేయగా నందుని అలా చూసి మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు.నువ్వేం చేస్తావో నాకు తెలియదు అమ్మ నాన్న మాత్రం మీ ఇంట్లో అడుగుపెడితేనే నువ్వు కూడా అడుగు పెడతావు అంటూ వారిని బయటకు పంపించి తలుపులు వేస్తుండగా తులసి అడ్డుపడి మొహం మీద తలుపులు వేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ తలుపులు వేయకుండా అడ్డుపడుతుంది.

ఇక లోపలి నుంచి నందు తలుపులు వేయడానికి ప్రయత్నిస్తుంటాడు ముందు చేతులు పక్కకు తీయి తులసి అంటూ నందు చెప్పిన తులసి వినకుండా మొండి చేస్తుంటుంది. ఇదే సమయంలోనే సామ్రాట్ పరంధామయ్యను తీసుకొని రావడం చూసిన నందు ఒక్కసారిగా తన తండ్రి వద్దకు వెళ్లి నాన్న నువ్వు వచ్చావా అంటూ తనని కౌగిలించుకోవడమే కాకుండా తన కాళ్లపై పడి క్షమాపణ కోరుకుంటారు.మీరు తిరిగి వచ్చారు నాకు ఇంతకన్నా కావాల్సిందేమీ లేదు రండి నాన్న లోపలికి వెళ్దాం అంటూ నందు పిలవగా పరంధామయ్య తనకు ఇక్కడికి వరకు మాత్రమే హద్దు ఉందని లోపలికి వచ్చే యోగ్యత నాకు లేదంటూ చెబుతారు.

ఇప్పటికే ఈ ఇల్లు ఎన్నో కోల్పోయింది మీ నాన్న గౌరవం,అన్ని ముక్కలు అయిపోయాయి. ఇలా ముక్కలైపోయిన బంధాలను ఒక్కొక్కటిగా దగ్గరికి చేర్చుకొని జాగ్రత్తగా ఉండు ఇంతకుమించి నేను ఏమి చెప్పలేను లోపలికి రాలేను అంటూ చెప్పారు. దీంతో అనసూయ మాట్లాడుతూ ఇదంతా కేవలం లాస్య వల్ల జరిగింది అంటూ చెప్పగా ఒక్కొక్కరు లాస్య గురించి మాట్లాడటంతో ఇప్పుడు మీరందరూ ఒక్కటై నన్ను పరాయిదాన్ని చేశారా అంటూ లాస్య మండిపడుతుంది.

ఇక ఈ విషయంపై ప్రేమ కూడా మాట్లాడటంతో ముందు నువ్వు నోరు అని లాస్య అనగా వెంటనే నందు లాస్య పై కోపం తెచ్చుకుంటాడు దీంతో ఇప్పుడు మీరంతా ఒక్కటైపోయారు నేనే చెడ్డదాన్ని అయిపోయానా అని లాస్య మాట్లాడటంతో నీకు ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఉండడం ఎందుకు ఇప్పుడే వెళ్లిపోదాం పద అంటూ నందు మాట్లాడుతారు.దీంతో లాస్య మీరందరూ ఒకటయ్యి నన్ను పరాయిదాన్ని చేశారు కదా ఇప్పుడు చూడండి ఈ ఇల్లు మొత్తం నా పేరు మీద ఉంది అని చెబుతూ అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో షాక్ అయిన తులసి నేను ఇంటినీ తన అత్తయ్య పేరు మీద రాశాను కదా అంటూ తులసి చెప్పడంతో నీకు తెలియకుండానే ఈ ఇంటిని నా పేరు మీద రాయించుకున్నాను అంటూ లాస్య అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.