సౌర్య విషయంలో దీపను మోసం చేస్తున్న కార్తీక్…. తప్పు చేస్తున్నావంటూ కార్తీక్ ను హెచ్చరించిన చారుశీల!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే..పండరి చంద్రుడు ఇంద్రమ్మ అడ్రస్ తనకు తెలుసని ఆటోలో బయలుదేరుతూ వెళ్తుంటారు. ఇదే విషయాన్ని దీప కార్తీక్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడు కార్తీక్ ఇంద్రుడికి ఫోన్ చేసి ఏదో చెబుతాడు. ఇక పండరి దీప అక్కడికి వెళ్ళగా కార్తీక్ కూడా అక్కడికి వెళ్తాడు.అయితే ఇల్లు అమ్మబడును అని బోర్డు వేసి ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు.

అది చూసిన కార్తీక్ మనము వస్తున్నామని తెలిసి ముందుగానే వెళ్లిపోయారేమో అనగా మనం వస్తున్నట్లు తెలిదు కదా అని పండరి అంటుంది. అప్పుడు దీప మీకు తెలుసు కదా డాక్టర్ బాబు అనడంతో నేను వీళ్ళకి ఫోన్ చేసి వెళ్ళమని చెప్పానా అని కార్తీక్ అంటాడు. నేను మీకు ఫోన్ చేసినప్పుడు హాస్పిటల్ లో ఎవరి ద్వారా అయినా తెలిసిందేమో అని దీప అనడంతో నువ్వు నిన్న హాస్పిటల్లో వాళ్ళని చూశావు కదా అందుకే వెళ్లి ఉంటారని కార్తీక్ కంగారుగా వాళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు.

మరోవైపు సౌందర్య చారుశీల హాస్పిటల్ కి వెళ్లినా కొడుకు కోడలు మిస్ అయ్యారని చెప్పడంతో అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అంటూ సమాధానం చెబుతుంది. సౌందర్య కార్తీక్ దీప ఫోటోలను చూపించడంతో చారుశీల షాక్ అవుతుంది. అలాంటివాళ్లు ఇక్కడ ఎవరూ లేరని చెబుతుంది. ఇక సౌందర్య పడే బాధను చూసి చలించిపోయిన చారుశీల మీ కొడుకు కోడలు బ్రతికే కనక ఉంటే వాళ్ళు ఉన్న ఇబ్బందులను పరిష్కరించుకొని మీ ఇంటి దగ్గరికి వస్తారు అని ధైర్యం చెబుతుంది. హాస్పిటల్లో శౌర్య పోస్టర్ చూసిన సౌందర్య ఇదేం కర్మ అని బాధపడుతూ ఆ నెంబర్ కి ఫోన్ చేయడంతో ఫోన్ పని చేయదు.

ఇక కార్తీక్ హాస్పిటల్ కి వెళ్లడంతో చారుశీల సౌందర్య వచ్చిన విషయాన్ని చెప్పి తప్పు చేస్తున్నవేమో కార్తీక్ ఇలా అయిన వాళ్ళందరిని మోసం చేస్తూ అందరిని బాధ పెడుతున్నావు. వ్యాధి కన్నా మనోవ్యాధి ఎంతో మనిషిని కృంగతీస్తుంది. బయట వ్యక్తి అయినా నాకే ఎంతో బాధగా ఉంది ఇక వాళ్లు ఎంత బాధ పడుతుంటారో అర్థం చేసుకో అని చెబుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.