పెళ్లి తర్వాతే ఇన్ని రకాల వంటలు ఉన్నాయని తెలిసింది.. హీరో కామెంట్స్ వైరల్!

తెలుగు ఓటీటీ సమస్థ ఆహా ద్వారా ఇప్పటికే ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లో ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆహాలో ఇప్పటివరకు ఎన్నో టాక్ షోలు కుకింగ్ కార్యక్రమాలు ప్రచారం అయ్యాయి. ఇదివరకు మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ఒక కుకింగ్ కార్యక్రమం ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం శ్రీముఖి వ్యాఖ్యాతగా చెఫ్ మంత్ర అనే కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు హాజరవుతూ పెద్ద ఎత్తున వంటలు చేస్తూ వంట వీడియోలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. షో చెఫ్ మంత్ర ఆహా ఓటీటీ ప్రేక్షకుల మెప్పుపొందింది. ఇప్పుడు ప్రముఖ న్యూస్ ఛానల్ లో కూడా ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి హీరో సుహాస్ హాజరయ్యారు.ఈ క్రమంలోని ఈయన శ్రీముఖితో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించడమే కాకుండా తాను విజయవాడలో తిన్న రుచులను ఈ కార్యక్రమం ద్వారా చేసి చూపించారు.

ఇకపోతే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు వంటల్లో ఇన్ని రకాలు ఉంటాయని తెలియదని పెళ్లయిన తర్వాతే వంటలలో ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయని తెలిసింది అంటూ ఈ హీరో ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా శ్రీముఖి సుహాన్ ఇద్దరు ఈ కార్యక్రమంలో భాగంగా పలు విషయాల గురించి మాట్లాడుతూ ఎంతో సరదాగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://youtu.be/d4O2P5F0zgA