దీప హెల్త్ కండిషన్ తెలుసుకొని షాక్ అయిన హేమచంద్ర… కార్తీక్ ఆస్తి పై కన్నేసిన చారుశీల!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… సౌందర్య ఎలాగైనా ఇంద్రుడి దగ్గర నుంచి నిజం రాబట్టాలని తనని అన్ని విధాలుగా భయపెట్టినప్పటికీ ఇంద్రుడు మాత్రం అబద్ధాలు చెప్పి కార్తిక్ దీప వాళ్ళ గురించి తనకు ఏమీ తెలియదని తప్పించుకుంటాడు. నిజం చెప్పకపోయేసరికి నీకు దండం పెడతాను వాళ్ళు ఎక్కడున్నారో చెప్పురా నా కొడుకు అని బ్రతిమాలినప్పటికీ ఇంద్రుడు మాత్రం నిజం చెప్పడు.

మరోవైపు దీప కార్తీక్ చారుశీల మాట్లాడిన మాటలను గుర్తుచేసుకొని బాధపడుతుంది. అంతలోక అక్కడికి హేమచంద్ర రావడంతో ఏమైందమ్మా అంత ఒకే కదా అనడంతో బాగుంది అన్నయ్య అంటుంది కానీ ఎందుకు నువ్వు బాధపడుతున్నట్టు ఉందని హేమచంద్ర అడగడంతో అప్పుడు కార్తీక్ చారుశీల మాట్లాడుకున్నటువంటి విషయాలన్నింటినీ హేమచంద్రకు చెప్పడంతో పండరీ హేమచంద్ర ఇద్దరూ షాక్ అవుతారు. నేను మరెన్నో రోజులు బ్రతకను అన్నయ్య అంటూ దీప ఎమోషనల్ అవుతుంది. అందుకే నా పిల్లలు నా కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారని తెలిసిన తను కలవనివ్వలేదు అని బాధపడుతుంది. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది దీప అంటూ హేమచంద్ర బాధపడి తనకు ధైర్యం చెప్పి వెళ్తాడు.

మరోవైపు హేమచంద్ర ఇంటిదగ్గర పూలు అందంగా కనిపించడంతో శౌర్య వాటిని కోయాలని వెళుతుంది. అందులోపు హేమచంద్ర ఎవరమ్మ నువ్వు అని అడగడంతో పక్కింటి లోకి వచ్చాం మా నాన్న కూడా డాక్టర్ అంటూ ఇద్దరు పరిచయం ఏర్పరచుకుంటారు. ఇక పండరి మీరు ఏ పనులు చేయొద్దండమ్మ డాక్టర్ బాబు చూస్తే ఆరుస్తారు అని చెబుతుంది.అప్పుడే కార్తీక్ అక్కడికి రావడంతో ఏంటి డాక్టర్ బాబు ఈ పనులు కూడా చేయకూడదా అనడంతో నువ్వే చెప్పు చారుశీల అంటుంది అప్పుడు చారుశీల మనసులో దీపను ఎలాగైనా నా ఆధీనంలోకి తెచ్చుకొని అది చనిపోయేలోపు కార్తీక్ నువ్వే పెళ్లి చేసుకొని చెప్పేలా చేసుకోవాలి. అలా కార్తీక్ ని పెళ్లి చేసుకుంటే తన ఆస్తి మొత్తం నాదే అవుతుందని మనసులో అనుకుంటుంది.

మరోవైపు సౌందర్య రావడంతో ఆనందరావు ఆ ఇంట్లోనే నిజం చెప్పాడా అనడంతో తనకు తెలియదని చెబుతున్నాడని సౌందర్య అంటుంది. నిజంగానే కార్తీక్ దీప గురించి వాడికి తెలియదేమో అని ఆనందరావు అనడంతో వాడికి తెలుసండి వాడు చెప్పేటప్పుడు మాటల్లో తడబడ్డాడు నిజంగా కార్తీకదీపం ఎక్కడున్నారో వాడికి తెలుసు అని మాట్లాడుతూ ఉండగా అంతలోపే సౌర్య రావడం తనకు హేమచంద్ర అంకుల్ పరిచయమయ్యారని చెప్పడం జరుగుతుంది. తను నాకు కూడా పరిచయమయ్యాడని ఆనందరావు చెబుతాడు మరోవైపు దీప మీకు హెల్త్ బాలేదు అన్నారు కదా మీరు కూడా చెక్ చేయించుకోండి అని చెప్పడంతో నేను ప్రతిరోజు చెక్ చేయించుకుంటున్నానని కార్తీక్ అబద్ధం చెబుతాడు.