బిగ్ బాస్ దీపావళీ స్పెషల్ ఎపిసోడ్ లో ఆది… ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడో తెలుసా?

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగు పెట్టిన తర్వాత కొంతకాలానికి టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. ఆది వేసే పంచులు సెటైర్లతో ఫాలోయింగ్ పెంచుకొని జబర్దస్త్ కి మూల స్థలంలో మారిపోయాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో లలో అది చేసే సందడి అంతా ఇంతా కాదు.

కొంతకాలం ఆది జబర్దస్త్ కి దూరం అవ్వటంతో జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో జబర్దస్త్ లో ఆది పాత్ర ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షో ని రాంప్రసాద్ తో కలిసి తన భుజాలు మీద ఎత్తుకొని నడిపిస్తున్నాడు. ఇలా ఇంతకాలం కేవలం ఈటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోలో మాత్రమే సందడి చేసిన ఆది ఇప్పుడు మాటీవీలో కూడా సందడి చేస్తున్నాడు. సాధారణంగా ఈటీవీ తో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వేరే ఏ ఛానల్లోనూ కనిపించడానికి వీలు లేదు. కానీ ఆదికే ఉన్న ఇమేజ్ వల్ల మల్లెమాలవారు ఆదికి కొంత వెసులుబాటు ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో ఆది ఇటీవల మాటీవీలో జరిగిన మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశాడు. బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా సందడి చేశాడు. బిగ్ బాస్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో ఆది కనిపించడంతో ఆ ఎపిసోడ్ రేటింగ్స్ బాగా పెరిగాయని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేసినందుకు ఆది అందుకున్న రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మా పరివార్ అవార్డ్స్ మరియు బిగ్ బాస్ కోసం స్టార్ మా వారు ఆది కి ఏకంగా 10 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్థాయి పారితోషికం అందుకోవడానికి ఆది అర్హుడు అంటూ ఆది అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.