నందు మీద ఉన్న నమ్మకంతో రష్మి ఇంత దైర్యం చేసిందా..?

బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన రష్మి..సినిమాల ద్వారా సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం దక్కించుకొని.. తన యాంకరింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి టీవీ షోలో మాత్రమే కాకుండా ఈటీవీలో నిర్వహించే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలలో కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ బాగా ఫేమస్ అయ్యింది. ఇలా యాంకర్ గా ఫేమస్ అయిన రష్మి అప్పుడప్పుడు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తాజాగా రష్మీ హీరోయిన్ గా నటించిన “బొమ్మ బ్లాక్ బస్టర్” సినిమా విడుదల అయింది.

సింగర్ గీత మాధురి భర్త నందు హీరోగా రష్మీ హీరోయిన్ గా నటించిన ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాకి రాజ్‌ విరాట్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్, టీజర్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. సుడిగాలి సుధీర్ కూడా ఈ ఈవెంట్లో సందడి చేశాడు. ఈ మేరకు నాగశౌర్య మాట్లాడుతూ.. “మంచి కథతో తీసిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని” నాగశౌర్య చెప్పుకొచ్చాడు.

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నందు మాట్లాడుతూ… రష్మి కి నా కృతజ్ఞతలు. నా మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా స్టోరీ కూడా వినకుండానే నాతో కలసి నటించటానికి ఒప్పుకుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాతలకు కూడా నందు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మీ మాట్లాడుతూ.. “నాది, నందూది 14 ఏళ్ల జర్నీ. రాజ్‌ విరాట్‌ అందించిన కథ ని నందు నమ్మితే, నేను నందును నమ్మి ఈ సినిమా చేశా” అంటూ చెప్పుకొచ్చింది. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. అందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని” రష్మి చెప్పుకొచ్చింది.