తార‌క్ ఫ్యాన్స్ చీవాట్ల‌కు జ‌క్క‌న్న జ‌వాబు ఎపుడు?

తార‌క్ అభిమానులు గుర్రుగా.. కార‌ణ‌మిదే

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. రెండేళ్ల‌యినా ఇంత‌వ‌ర‌కూ తార‌క్ నుంచి స‌రైన ట్రీట్ లేనేలేదు. పైగా ఆర్.ఆర్.ఆర్ లో కొమురం భీమ్ లుక్ ఇదీ అన్న క్లారిటీ కూడా రాలేదు ఇంకా. దీనంత‌టికీ కార‌కుడు రాజ‌మౌళి. జ‌క్క‌న్న అతి జాగ్ర‌త్త వ‌ల్ల‌నే ఇలా అయ్యింది! అన్న‌ది తార‌క్ అభిమానుల థింకింగ్. అందుకే మొన్న తార‌క్ బ‌ర్త్ డే కి ట్రీట్ మిస్స‌య్యింది.

కానీ ఈలోగానే మ‌రో నంద‌మూరి హీరో తార‌క్ ఆరాధ్య న‌టుడు అయిన బాల‌కృష్ణ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లిపోయింది. న‌ట‌సింహా న‌టిస్తున్న తాజా చిత్రం బీబీ 3 లుక్ బ్లాక్ బ‌స్ట‌ర్ రేంజులో దూసుకెళ్లిపోయింది. సింహాని మ‌రోసారి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో బోయ‌పాటి చూపించ‌బోతున్నాడ‌ని ఫ్యాన్స్ కి అర్థ‌మైంది. అస‌లు ఫుటేజ్ అన్న‌దే లేకుండా బోయ‌పాటి చాలా మ్యాజిక్ చేశాడు ఆ టీజ‌ర్ లో. అయితే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి తార‌క్ పై కొమురం భీమ్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించి కూడా బ‌ర్త్ డే టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌లేక‌పోయాడు రాజ‌మౌళి. దీనిపై తార‌క్ ఫ్యాన్స్ చాలా సీరియ‌స్ గానే ఉన్నార‌ట‌.

అయితే తార‌క్ మాత్రం దీనిపై సైలెంటుగా ఉన్నాడు. త్వ‌ర‌గా ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని త‌దుప‌రి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాపై దృష్టి సారించ‌బోతున్నాడు. 2021లో ఆర్.ఆర్.ఆర్ స‌హా త్రివిక్ర‌మ్ మూవీతో ఫ్యాన్స్ కి డ‌బుల్ ట్రీట్ ఇచ్చి ఖుషీ చేయాల‌న్న‌ది అత‌డి ప్లాన్. ఇక‌పోతే రాజ‌మౌళి కంటే బోయ‌పాటి ప్ర‌స్తుతం ఎక్కువ మార్కులు కొట్టేశాడు. అత‌డిని త‌గ్గించాలంటే కొమ‌రం భీమ్ లుక్ తో జ‌క్క‌న్న సెన్సేష‌న్స్ సృష్టించాల్సి ఉంటుంది.