త్రిష తాజాగా నటిస్తున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మణితర్నం తెరకెక్కిస్తున్నఈ సినిమాలోని ఆమె రాణి కుందవై పాత్రను పోషిస్తోంది. ఈ క్యారక్టర్ కోసం త్రిష ఎంతగానో శ్రమిస్తోందిట. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నారు. చోళ రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.
ప్రేక్షకులు త్రిషను మరచిపోయి తెర మీద కుందవైనే చూస్తున్నట్లుగా భావించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. ‘ఈ పాత్ర చేయడం నీవల్ల అవుతుందా?’ అని సవాల్ విసిరే పాత్ర వచ్చినప్పుడు ఎంత రిస్కు అయినా తీసుకోవడానికి వెనకాడని తారలు ఉంటారు. తాజాగా త్రిష కూడా అలాంటి సవాల్నే స్వీకరించారు.
ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవడం త్రిష ముందు ఉన్న పెద్ద సవాల్. ఈ సినిమాలోని రాణి కుందవై పాత్ర కోసమే ఆమె హార్సు రైడింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. చెన్నైలోని ఓ హార్సు రైడింగ్ స్కూల్లో నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఐదు రోజుల్లో ‘ఇంట్రో టు హార్సు బ్యాక్ రైడింగ్’ కోర్సు పూర్తి చేసింది. ఆ తర్వాత స్వారీ చేయడానికి ఫౌండేషన్ కోర్సు మొదలుపెట్టింది. ఈ కోర్సుని కూడా విజయవంతంగా పూర్తి చేశారామె. ‘సర్టిఫికెట్ కూడా వచ్చేసింది’ అని ఆనందం వ్యక్తం చేశారు త్రిష.
గతంలో ఏ సినిమాకు త్రిష ఎంతగా కష్టపడలేదట. అంతగా కష్టపడడం వెనక ఏదో విషయం దాగిఉంది అని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇంతకీ త్రిషలో దాగిఉన్న ఆ విషయం ఏంటో!? అని కూడా చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యా రాయ్ తదితరులు నటిస్తున్నారు.