మణిరత్నం పై మనసు పారేసుకున్నదట ..?

భారత దేశంలో వున్న అతి  కొద్దీ మంది గొప్ప దర్శకులలో  మణిరత్నం ఒకరు . ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సంచలన విజయం సాధించాయి . పల్లవి అనుపల్లవితో ఆయన దర్శకుడయ్యారు . ఆ తరువాత మౌన రాగం ,నాయకుడు , గీతాంజలి, రోజా ,బొంబాయి , దళపతి, ఇరువురు ,దిల్ సే ,గురు , రావణ్ , కాదల్  చిత్రాలు అయన ప్రతిభకు నిదర్శనం . ఎంతో మంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆయన చేయూత నిచ్చారు , గుర్తింపు గౌరవం తెచ్చారు . ఎవరైనా ఒకప్పుడు, కె. బాల చందర్, బాపు , కె. విశ్వనాథ్ చిత్రాల్లో నటించాలని  కలలు కనేవారు . ఇప్పుడు మణిరత్నం చిత్రంలో నటించాలని చాలా మంది హీరోయిన్స్  ఆశాభావంతో  వున్నారు  . ఆ కోవలోకి తాప్సి  చేరింది .

‘ నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను . తెలుగులో “ఝుమ్మంది  నాదం’ తమిళంలో  “ఆడుకాలం” చిత్రాలతో రెండు భాషల్లో పరిచయం అయ్యాను . తెలుగు సినిమా హిట్ అయ్యింది . తమిళ సినిమా అవార్డులను తెచ్చిపెట్టింది . నిజానికి నేను ఎంబీఏ చేసి మార్కెటింగ్ ఫీల్డ్లో  వుందామనుకున్నా . సినిమా రంగంలోకి  వచ్చాక ఈ సరదా కూడా చూద్దామనుకున్నా  , హిందీ సినిమా రంగంలోకి కూడా అడుగు పెట్టాను . అయినా ఓ అసంతృప్తి మిగిలింది ” అని చెప్పింది .

ఏమిటా అసంతృప్తి ? అని అడిగినప్పుడు తాప్సి  తన మనసులో మాట బయట  పెట్టింది . “ఎప్పటికైనా మణిరత్నం హీరోయిన్  అనిపించుకోవాలి , అదే నా జీవితాశయం  ” అని చెప్పింది . తాప్సి కల నెరవేరుతుందో లేదో చూడాలి .