యురి మళ్ళీ రిలీజ్ అవుతుంది !

యురి చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డంతో పాటు భార‌త ప్ర‌ధాని ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. 45 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో పరేశ్ రావల్, రజిత్ కపూర్, కృతి కుల్హరి కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 200 కోట్ల వ‌సూళ్ళు ఈ చిత్రం రాబ‌ట్టింది. అయితే ఈ చిత్రాన్ని జులై 26న కార్గిల్‌ దివస్‌ను పురస్కరించుకుని మళ్లీ విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. ఆ ఒక్కరోజు మాత్రమే సినిమాను మ‌హారాష్ట్ర మొత్తం ప్రదర్శించనున్నట్లు నిర్మాత రోన్నీ స్క్రూవాలా మీడియా ద్వారా వెల్లడించారు. ఆ రోజు సినిమాని ఉచితంగా చూసే అవ‌కాశం కూడా క‌లిపిస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. చిత్రంలో స‌ర్జిక‌ల్ స్ట్రైక్ జ‌రిపేందుకు వెళ్ళే స‌మ‌యంలో క‌మాండ‌ర్ ‘హౌ ఈజ్‌ ద జోష్‌’.. అని తోటి సైనికుల‌ని అడుగుతుంటే వారు హై స‌ర్ అని అంటారు. ఈ డైలాగ్‌కి ప్ర‌ముఖులు కూడా ఫిదా అయిన సంగతి తెలిసిందే.