త్రివిక్రమ్ అండతో అబద్దాన్ని నిజం చేస్తున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, క్యాథరీన్‌ హీరోయిన్స్ గా నటిస్తారని టాక్‌. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ‘నాన్న.. నేను’ అనే టైటిల్‌ను చిత్ర యీనిట్ పరిశీలిస్తోందని ప్రచారం జరగుతోంది. తండ్రీ కొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందట. అలాగే ఈ చిత్రం గురించిన ఓ ఇంట్రస్టింగ్ టాపిక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

అదేమిటంటే.. అల్లు అర్జున్ అనుకోకుండా ఒక అబద్దం చెప్పగా… ఆ అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో కామెడీ పండిస్తూ కనబడతాడట. ఇక ఆ అబద్దం చివరికి నిజమవటమే సినిమా అంటున్నారు. ఆ అబద్దం అత్యవసర సమయంలో తన కుటుంబం కోసం ఆడతాడట. మరి ఆ అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో పడే కష్టాలుతో కామెడీ పండిస్తూ నవ్విస్తాడట.

అలాగే ఈ సినిమా మొత్తం.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తోఅదిరిపోనుందనేది లేటెస్ట్ న్యూస్. కామన్ గానే త్రివిక్రమ్ డైలాగ్స్ మాటలు తూటాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయట. అయితే అరవింద సమేత లో త్రివిక్రమ్ మార్క్ కామెడీ మిస్ అయ్యిందని అన్నారు. ఈసారి అల్లు అర్జున్ సినిమా లో ఆ కామెడీ ఎక్కడా మిస్ కాకుండా త్రివిక్రమ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని చెప్తున్నారు.

ఇంతకుముందు అల్లు అర్జున్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలోనూ ఫాదర్‌ సెంటిమెంట్‌ ఉంటుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే… అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘