టాక్ విత్ పూరి – “పుష్ప 1” పై షాకింగ్ నిజం ఓపెన్ చేసిన సుకుమార్..!

గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన లేటెస్ట్ చిత్రాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చివేసిన బిగ్ ప్రాజెక్ట్ “పుష్ప 1” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ సాలిడ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించగా ఇప్పుడు యావత్తు పాన్ ఇండియా ఆడియెన్స్ సీక్వెల్ కోసం బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు లెవెల్లో ఎదురు చూస్తున్నారు.

అయితే లేటెస్ట్ గా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని షేక్ చెయ్యడానికి రెడీగా ఉన్న మరో తెలుగు సినిమా “లైగర్”. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ గా రేపు రిలీజ్ కాబోతుండగా ఇప్పుడు ఈ ఇద్దరు డైరెక్టర్స్ మధ్య అయ్యిన ఇంటర్వ్యూ బయటకి వచ్చింది.

అయితే ఇందులో సుకుమార్ పుష్ప సినిమాపై ఒక ఊహించని నిజాన్ని బయట పెట్టాడు. నిజానికి సినిమా తాము ఇక్కడ ఇంటర్వెల్ ఇక్కడ క్లైమాక్స్ అనుకోలేదని అలా సినిమా తీసి ఫహద్ తో ఎపిసోడ్ ని క్లైమాక్స్ గా సెట్ చెయ్యగా అప్పటికే సినిమా ఏకంగా మూడు గంటలు వచ్చేసింది అని అంతా షాక్ అయ్యామని.. 

సరే ఏమన్నా కట్ చేసేద్దామా అంటే సినిమాలో ఫ్లో పోతుంది అని సునీల్ దగ్గరకి వెళ్లే సీన్ లోనే పుష్ప అలా వెళ్లి నార్మల్ గా మాట్లాడేస్తే ఏం బాగుంటుంది అని ఒక ఫైట్ పెట్టి ఇంటర్వెల్ లా ప్లాన్ చేశామని అసలు నిజం బయట పెట్టాడు. అయితే సినిమాలో బాగా గమనిస్తే క్లైమాక్స్ లో కూడా సెకండ్ ఇంటర్వెల్ అని కూడా వస్తుంది.