తిరుపతిలో సుకుమార్ మకాం, ఏం చేస్తున్నాడంటే…?

మహేష్ తో వివాదాలు, తన నిర్మాణంలో చేస్తున్న ప్రాజెక్ట్ లను ప్రక్కన పెట్టి సుకుమార్ ప్రస్తుతం తన దృష్టి మొత్తాన్ని తన తదుపరి చిత్రంపై పెట్టారు. అల్లు అర్జున్ తో చేయబోయే ఆ చిత్రం స్క్రిప్టు ని రీసెంట్ గానే లాక్ చేసినట్లు సమాచారం. ఈ సంవత్సరం ద్వితీయార్దంలో షూటింగ్ ప్రారభం కానుంది. దాంతో ఈలోగా తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో లొకేషన్స్ ని అన్వేషిస్తున్నారు.

అక్కడ సినిమాకు సంభందించి కీలకమైన ఎపిసోడ్స్ ని చిత్రీకరించనున్నారు. దట్టమైన అడవుల్లో కొన్ని యాక్షన్ సీక్వన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఇంటెన్స్ తో ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని చెప్తున్నారు.

మే 11 న ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అవనుంది. త్రివిక్రమ్ తో చిత్రం ఓ కొలిక్కి రాగానే సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం కోసం ఓ భారీ సెట్ ను సైతం సుకుమార్ నిర్మిస్తున్నట్లు గా చెప్తున్నారు. అల్లు అర్జున్ గత చిత్రాలకు పూర్తి స్దాయి భిన్నంగా ఈ సినిమాలో కనిపించనున్నారు. రంగస్దలం చిత్రంతో మెగా హిట్ కొట్టిన సుకుమార్ ఎలాగైనా ఈ సినిమా దాని రికార్డ్ లు బ్రద్దలుకొట్టే స్దాయిలో ఉండాలని భావిస్తున్నారట. మైత్రీ మూవీస్ వారు నిర్మించే ఈ చిత్రం ఖచ్చితంగా సంచలనం అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.