2019 ని ముగించి 2020లో అడుగు పెట్టాం. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ 31 మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కోసం సెలబ్రిటీలంతా ఎవరికీ దొరక్కుండా ఔట్ స్కర్ట్స్ కి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కొందరు విదేశాలకు వెళితే.. మరికొందరు స్వదేశంలోనే రకరకాల చోట్లకు వెళ్లారు. మహేష్ కుటుంబ సమేతంగా ముంబైలో కొత్త సంవత్సరం వేడుకల్ని చేసుకున్నారు. అలాగే రామ్ చరణ్- ఉపాసన జంట, నాగచైతన్య – సమంత జంట గోవాలో అదిరిపోయే పార్టీ చేసుకున్నారు.
అలాగే అల్లు అర్జున్ – స్నేహ జంట ప్రత్యేకంగా దుబాయ్ లో కొత్త సంవత్సర సెలబ్రేషన్స్ జరుపుకున్న ఫోటోలు తాజాగా అంతర్జాలంలోకి రిలీజయ్యాయి. ఇక ఈ ఎన్.వై.ఈ పార్టీలో బన్ని పొట్టి నిక్కరుతో కనిపించగా తన సతీమణి స్నేహ షిమ్మరీ గౌనులో కనిపించింది. ఇక ఈ ఇద్దరికీ సామాజిక మాధ్యమాల్లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది.
