`బ్ర‌హ్మోత్స‌వం` నుంచి ఇప్పటికి కోలుకుని…

ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా తెలుగు పరిశ్రమలో శ్రీకాంత్ అడ్డాలని చెప్తూంటారు. `కొత్త బంగారు లోకం`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` హిట్ లతో  ఆయన తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన వరుణ్ తేజ తో వచ్చిన `ముకుంద‌` సినిమా సక్సెస్ సాధించ‌లేక‌పోయినా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుతో ఆఫర్ వచ్చింది. దాంతో  భారీ తారాగ‌ణంతో  `బ్ర‌హ్మోత్స‌వం` తీసాడు. అయితే అది టీవి సీరియల్ కన్నా ఘోరంగా ఉందంటూ విమర్శలు ఎదుర్కొని డిజాస్టర్ అయ్యింది.

దాంతో  ఈ సినిమా దెబ్బకి  శ్రీకాంత్ ల్యాంగ్ గ్యాప్ తీసుకునే పరిస్దితి వచ్చింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు అంటే… 2016 నుంచి ఈ ద‌ర్శ‌కుడు ఒక్క సినిమాను కూడా ప్రారంభించలేదు. అయితే త్వ‌ర‌లో శ్రీకాంత్ అడ్డాల ఓ సినిమాను ప్రారంభించ‌బోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. యంగ్ హీరో శ‌ర్వానంద్‌తో శ్రీకాంత్ ఓ సినిమా చేయ‌బోతున్నాడని, ఈ మేరకు ఓ కథని ఆల్రెడీ వినిపించాలని చెప్తున్నారు.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించ‌బోతోంద‌ని వినికిడి. ఇప్పటికే  స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దస‌రా త‌ర్వాత రెగ్యులర్ షూటింగ్
ప్రారంభం కాబోతున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో శర్వానంద్‌ కాలేజీ స్టూడెంట్‌గా  కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ  సినిమాను దసర రోజున లాంఛనంగా ప్రారభిస్తారు. అల్లు అరవింద్ ఈ సినిమాని పిలిచి  ఇచ్చినట్లు చెప్తున్నారు. రీసెంట్ గా అల్లు అరవింద్ నిర్మించిన గీతా గోవిందం  సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.