శ్రీముఖి, వర్షిణి క్రేజ్ దేశాలు దాటేసింది.. ఆ లిస్ట్‌లోకి ఎక్కేశారు!!

Sreemukhi And Varshini Are In Kiran Rai 400 Most Influential List

బుల్లితెరపై యాంకర్లుగా దూసుకుపోతోన్న శ్రీముఖి, వర్షిణిలు తాజాగా ఓ ఫీట్ అందుకున్నారు. ఈ ఏడాదిలో అత్యంత ప్రభావ శీలుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ దేశాల్లో ఈ ఏడాది గానూ 400 మందితో కూడా మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ సెలెబ్రిటీస్ లిస్ట్‌ను రిలీజ్ చేశాడు. బ్రిటీష్ ఇండియన్ యాక్టర్, మ్యాగజిన్ రైటర్ అయిన కిరణ్ రాయ్ ఈ జాబితాను ప్రకటించాడు. ఇందులో తెలుగులో నుంచి చాలా మంది యాంకర్లు, సెలెబ్రిటీలున్నారు.

Sreemukhi And Varshini Are In Kiran Rai 400 Most Influential List
Sreemukhi And Varshini Are In Kiran Rai 400 Most Influential List

ప్రగతి, రష్మీ, వర్షిణి, శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజు వంటివారున్నారు. కాజల్ అగర్వాల్, శ్రుతీహాసన్, అద్నాన్ సమీ, హరి హరణ్, శంకర్ మహదేవన్, ఏఆర్ రెహ్మాన్ వంటి వారంతా ఉన్నారు. అయితే తెలుగులో నుంచి బుల్లితెర స్టార్లు ఇలా ప్రభావ శీలుర జాబితాలోకి ఎక్కడంతో వారు ఆనందంతో తేలిపోతోన్నారు. శ్రీముఖి, వర్షిణి వంటి వారు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Sreemukhi And Varshini Are In Kiran Rai 400 Most Influential List
Sreemukhi And Varshini Are In Kiran Rai 400 Most Influential List

అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఇలా తమ పేరు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇటు వర్షిణి, అటు శ్రీముఖి బుల్లితెరపై దుమ్ములేపుతున్నారు. ఈ లిస్ట్‌లో ఉన్న వారందరినీ కిరణ్ రాయ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇప్పటికే శ్రీముఖి, ప్రగతి వంటి వారు ఇంటర్వ్యూలను తీసుకున్నాడు. ఇక వర్షిణి, ప్రదీప్‌ల ఇంటర్వ్యూ కూడా త్వరలోనే రానుంది.