దిల్ రాజు 50పార్టీ: నందమూరి హీరోలు ఎందుకు రాలేదు?

ఆ పాత్ర మాకు వ‌ద్దంటే వ‌ద్దు బాబోయ్‌ అంటున్న బాలకృష్ణ, జూ ఎన్టీఆర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. మంచి సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల్లో ఆయన నెంబర్ వన్ లో ఉంటారని చెప్పవచ్చు. ఇక అలాంటి నిర్మాత అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇష్టమే. స్టార్ హీరోలందరు సన్నిహితులే. ఇక అలాంటి నిర్మాత 50వ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

dil raju

ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలంతా ఓకే పార్టీలో కలిశారు అనే ఊహ చాలా గొప్పగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగ చైతన్య.. అలాగే కన్నడ స్టార్ హీరో యష్ కూడా పార్టీలో చేరారు. అయితే ఒక్క నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు ఎన్టీఆర్ తో బృందావనం, రామయ్య వస్తావయ్యా అనే సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ తో తప్పితే దిల్ రాజుకు ఆ ఫ్యామిలీలో మిగతా వారితో పెద్దగా బాండింగ్ లేదు. ఇక దాదాపు అగ్ర హిరోలందరిని ఇన్వైట్ చేసినప్పుడు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారిని పిలవలేదా అనే టాక్ వస్తోంది. మరొక టాక్ ఏమిటంటే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ను పిలిచారు గాని బాలయ్యను పిలవలేదట. అందుకే ఇద్దరు హీరోలు కూడా రాలేదని రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే వారే క్లారిటీ ఇవ్వాలి.