‘రణరంగం’ …ఎన్టీఆర్ మధ్య నిషేధం తో లింక్, వివాదం కాదు కదా?

‘రణరంగం’ …ఎన్టీఆర్ మధ్య నిషేధం తో లింక్, వివాదం కాదు కదా?

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా.. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ తేదీన విడుదల కావాల్సిన ప్రభాస్ ‘సాహో’ చిత్రం వాయిదా పడటంతో అడవి శేష్ ‘ఎవరు’, శర్వానంద్ ‘రణరంగం’ చిత్రాలు ఆరోజు విడుదలకు హడావిడిగా రెడీ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

త్రివిక్రమ్ చేతుల మీదుగా రిలీజైన ఈ ట్రైలర్ లో శర్వా లుక్, డైలాగ్ డెలవరీ, బాడీ లాంగ్వేజ్ రొటీన్ కు భిన్నంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ మధ్య నిషేధకాలం నాటి బ్యాక్ డ్రాప్ తీసుకుని, అప్పుడు లిక్కర్ కింగ్ గా ఎదిగిన ఓ వ్యక్తి కథ చెప్పాలనుకోవటం మరీ ఆసక్తి రేపుతోంది. అయితే మధ్య నిషేధ సమయంలో లిక్కర్ కింగ్ గా ఎదగటం అంటే అప్పటి ప్రభుత్వం ఫెయిలనట్లు చెప్తున్నట్లా అని కొందరు కామెట్స్, సోషల్ మీడియాలో చర్చలు చేయటం అప్పుడే మొదలెట్టారు. మీరూ ఆ ట్రైలర్ ని చూడండి.

Ranarangam Theatrical Trailer - Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan | Sudheer Varma

చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు సుధీర్ వర్మ ‘రణరంగం’ను తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అన్ని వర్గాలవారినీ ఈ చిత్రం అలరిస్తుంది. మన తెలుగులో టాలెంట్ ఉన్న నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. ‘గ్యాంగ్ స్టర్’గా ఈ చిత్రంలో శర్వానంద్ పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్‌తో కలిసి ఉంటుంది.

‘గ్యాంగ్ స్టర్’ అయిన హీరో జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రం సొంతం. మా హీరో శర్వానంద్ ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. చిత్రంపై మాకెంతో నమ్మకం ఉంది. ప్రేక్షకులు కూడా ఈ నూతన ‘గ్యాంగ్ స్టర్’ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది..’’ అన్నారు.