రూటు  మార్చే ప్రయత్నంలో శర్వానంద్

రూటు  మార్చే ప్రయత్నంలో శర్వానంద్!

 
తెలుగు చలన చిత్రపరిశ్రమలోని ప్రతిభావంతమైన నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు.  వైవిధ్యమైన పాత్రలతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకున్నాడు. తను ఎంపిక చేసుకుంటున్న సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఇంకా  బాక్సాఫీస్ వద్ద సోసో హీరో గానే మిగిలిపోతున్నాడు. ఇక లాభం లేదనుకున్న శర్వానంద్ తన రూటు  మార్చే ప్రయత్నంలో ఉన్నాడు.
 
క్రేజీ  హీరోగా మారేందుకు, కెరీర్ లో జోరుగా పరుగులు  తీసేందుకు కసరత్తులు మొదలు పెట్టాడు. ఇక తను చేసే చిత్రాలు, ఎంపిక చేసుకునే పాత్రలు అన్నీ గత చిత్రాలకు భిన్నంగా ఉండేలా పావులు కదుపుతున్నాడు. అందులో భాగంగానే తన న్యూ మూవీ ‘రణరంగం’ ని  ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో  సితార ఎంటర్ టైన్మెంట్స్ పై రూపు దిద్దుకున్న ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడీగా  కథానాయికలు కాజల్, కళ్యాణి ప్రియదర్శినిలు నటిస్తున్నారు ఈ  ‘రణరంగం’  ఆగస్టు 15 న విడుదల కానుంది. ‘గ్యాంగ్ స్టర్’ గా ఈ చిత్రం లో శర్వానంద్  పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నం గా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుందట.
 
‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర  కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’ అని శర్వానంద్ చెబుతున్నాడు.   భిన్నమైన భావోద్వేగాలు, కధ, కధనాలు ఈ చిత్రంలో  కనిపిస్తాయట.  ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో శర్వానంద్  చక్కని ప్రతిభ కనబరిచినట్లు చెప్పుకుంటున్నారు. చూద్దాం.. ‘గ్యాంగ్ స్టర్’గా  శర్వానంద్ ఎలాంటి ‘రణరంగం’ ను చూపిస్తాడో!