చివరి షెడ్యూల్లో నాగచైతన్య “సవ్యసాచి”

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సవ్యసాచి”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో ఆర్.మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషించారు. 

ఈ చిత్రం టాకీ పార్ట్ ఆగస్ట్ 8తో పూర్తికానుంది. ఆగస్ట్ 15న ఫారిన్ లో ఆఖరి పాటను చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 15 నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తోపాటు సీజీ వర్క్ కూడా పూర్తికానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.

 

తారాగణం: 

నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు 

 

సాంకేతిక నిపుణులు:

సంగీతం: ఎం.ఎం.కీరవాణి, 

ఛాయాగ్రహణం: యువరాజ్, 

కళ: రామకృష్ణ, 

కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, 

పోరాటాలు: రామ్-లక్ష్మణ్, 

సహాయ దర్శకుడు: చలసాని రామారావు,

 సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), 

లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్, 

సహ నిర్మాత: ప్రవీణ్.ఎం, 

నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), 

కథ-మాటలు-చిత్రానువాదం-దర్శకత్వం: చందు మొండేటి.