నిర్మాతకు సాయి పల్లవి ట్విస్ట్ ..మామూలుగా లేదుగా

సాయి పల్లవి ఈ పేరు ఇప్పుడు తెలుగు కుర్రాళ్లకు గుండె చప్పుడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంగి. ఇప్పటికే యంగ్ హీరోలు నాగ శౌర్య, నానిలతో నటించిన ఈ భామ ప్రస్తుతం శర్వానంద్ సరసన పడి పడి లేచే మనసు అనే సినిమా చేస్తుంది.ఈ చిత్రం షూటింగ్ లో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమెపై రూమర్స్ వచ్చాయి. శర్వానంద్ తో గొడవ పడడం వలన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం లేదంటూ రూమర్స్ వినిపించాయి. దీనిపై వివరణ ఇచ్చింది సాయి పల్లవి. అయితే ఇప్పుడు ఆమె పై మరో టాక్ బయిలుదేరింది.

పడి పడి లేచే మనసు చిత్రం షూటింగ్ లో ఆమె బాగా సహకరించిందని, అయితే సినిమా అవుట్ పుట్ చూసుకున్న దర్శకుడు..రీషూట్ ప్లాన్ చేసాడని సమాచారం. దాంతో రీషూట్ కు బల్క్ గా మరికొద్ది రోజులు అడగటంతో ఆమె ఎగస్ట్రా రెమ్యునేషన్ అడిగిందని, దాంతో నిర్మాతలు ఖంగుతిన్నారని తెలుస్తోంది.

సాధారణంగా ..ఓ సినిమా డేట్స్ నిమిత్తం ఇంత అని మాట్లాడుకున్న తర్వాత ప్యాచ్ వర్క్ అనో, మరొకటి అనో నాలుగైదు రోజులు కావాలంటే హీరో,హీరోయిన్స్ వస్తూంటారు. వాటికి ప్రత్యేకంగా వసూలు చేయరు. అయితే బల్క్ గా ఎక్కువ రోజులు అడిగితే మాత్రం సాయి పల్లవి లాంటివాళ్లు కాస్తంత రెమ్యునేషన్ కావాలని అడగటం మొదలెడతారు. అయితే నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకపోవటంతో ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిత్రం డిసెంబర్ 21 న విడుదల కాబోతోంది.

శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘పడి పడి లేచే మనసు’. ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కథను మలుపుతిప్పే పాత్రలో సునీల్ నటిస్తున్నాడని తెలిసింది. మరోవైపు శర్వా కూడా తన కెరీర్‌లో ఇప్పటివరకూ కనిపించని విధంగా న్యూ లుక్‌లో వెండితెర దర్శనమీయనున్నాడు.