గ్యాప్ ఇవ్వవా వర్మ, పాపం గోలెత్తిపోతున్నారు

రామ్ గోపాల్ వర్మ తన సినిమాకు పబ్లిసిటీ కోసం ఎలాంటి మాటలైనా మాట్లాడతారు..ఏ పోస్ట్ అయినా పెడతారనేది తెలిసిందే. అందులోనూ ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్….ఓ వివాదాస్పదమైన పాయింట్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ చిత్రం. దాంతో మొదలు పెట్టిన రోజు నుంచి ఏదో విధంగా మీడియాలో నానుతోంది. దానికి తోడు ఎన్టీఆర్ బయోపిక్ ..కథానాయకుడు డిజాస్టర్ అవటం ఆయనకు కలిసివచ్చింది. మాటల జోరు పెంచేసారు. వరసపెట్టి తెలుగుదేశం పార్టి కు కౌంటర్స్ ఇచ్చుకుంటూ పోతున్నారు. కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వటం లేదు.

తాజాగా ఆయన ఆకుపూజ చేసి రెడీగా ఉండమంటున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మీ కన్నీళ్లకు నేను బాధ్యుడిని కానంటూ ట్విటర్ సాక్షిగా ప్రకటించారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 14.. వాలెంటైన్స్ డే సందర్భంగా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ కన్నీరు తెప్పిస్తుందని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.

‘ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్లకి దగ్గరలో ఉన్న గుళ్లలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఉదయం 9:27 గంటల కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు’’ అని వర్మ ట్వీట్ చేశారు. అదీ సంగతి.