మారుతి ‘ఈ రోజుల్లో’ … హీరోయిన్ కు బిజీపి టికెట్

దర్శకుడు మారుతి డైరక్ట్ చేసిన తొలి చిత్రం ‘ఈ రోజుల్లో …’. అందులో హీరోయిన్ గా చేసిన రేష్మ రాఠోడ్‌ ఆ తర్వాత కొద్ది సినిమాలు చేసింది.అయితే అవి పెద్దగా ఆడకపోవటంతో బిజీ కాలేకపోయింది. ఇప్పుడు ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే సినిమాల్లో నటిస్తూ కాదు… తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల రెండో జాబితా లో ఒక అభ్యర్దిగా కనిపించి.

పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం రాత్రి వరకు అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. ఈ సమావేశంలో లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, రామచంద్రరావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని భాజపా గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అక్టోబరు 20న 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా.. శుక్రవారం తాజాగా 28 మందితో రెండో జాబితా విడుదల చేసింది. అందులో రేష్మి పేరు ఉంది. వైరా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనుంది. అక్కడ ఆమె ఎస్ టి రిజర్వేషన్ కేటగిరిలో సీట్ ఇచ్చారు. ఆమె రాకతో డిసెంబర్ 7 న జరగనున్న తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు బిజిపి పార్టికి గ్లామర్ టచ్ వచ్చినట్లైంది.