పవన్ కోసం రాసిన కథే… రవితేజ పక్కన పెట్టలేదట!

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ కోసం ‘కందిరీగ’, ‘రభస’ సినిమాల దర్శకుడు ఓ కథ రెడీ చేశాడు. తమిళంలో హిట్టయిన విజయ్ ‘తెరి’ సినిమాకి పవన్ అభిరుచులు, సూచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి, తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొత్త స్క్రిప్ట్ రాశాడు. అంతా సిద్ధమైంది షూటింగుకి వెళ్లడమే తరువాయి… అనుకున్న టైమ్‌లో పవన్ సినిమా చేయనున్నాడు. రాజకీయాల్లోకి చురుకైన పాత్ర పోషించాలని పవన్ తీసుకున్న నిర్ణయం ఈ సినిమాకి బ్రేకులు వేసింది. దాంతో ఈ కథ రవితేజ దగ్గరకు వచ్చింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆ సినిమా చేస్తున్నట్టు మాస్ మహారాజ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. కానీ, షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో సినిమా ఆగిందని వార్తలు వచ్చాయి. అవేవీ నిజం కాదని యూనిట్ సభ్యుల నుండి అందుతోన్న సమాచారమ్. సెప్టెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ప్రజెంట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చేస్తున్నారు రవితేజ. ఈ సినిమా, సంతోష్ శ్రీనివాస్ సినిమా షూటింగులు ఒకేసారి చేయడం కష్టమని భావించిన రవితేజ… ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫినిష్ చేశాక, సంతోష్ శ్రీనివాస్ సినిమా స్టార్ట్ చేస్తానని చెప్పారట.