గీత గోవిందం  నేర్పిన పాఠం

గీత గోవిందం సినిమా కొందరికి మోదాన్ని పంచి పెడితే ఒక ప్రేమికుడు జీవితాన్ని దెబ్బ తీసిందని అంటున్నారు . గీత గోవిందం సినిమాను విజయ దేవరకొండ , రష్మిక జంటగా పరశురామ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించాడు . అల్లు అరవింద్ అనగానే పెద్ద బడ్జెట్ ఉంటుంది . ఐతే ఈసినిమాను  10 కోట్ల లోపే  తీశారని చెప్పుకుంటున్నారు . అర్జునరెడ్డి సినిమాతో మహా ఉత్సాహంగా వున్నా విజయ దేవర కొండ గీత గోవిందంతో తన మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు . ఈ సినిమా ఇప్పటికే 70 కోట్లకు పైగా షేర్  వచ్చిందని అంటున్నారు . నిజాం 20 కోట్లు, విదేశాల్లో 12.
కోట్లు మిగతా ఏరియాలు అన్ని కలిపితే  70 కోట్ల వరకు సంపాదించి పెట్టిందట . ఈ ఉత్సాహంతో అల్లు అరవింద్ పరశురాంకు మరో సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడట .

విజయ దేవరకొండ అటు నిర్మాతలు, ఇటు దర్శకుల దృష్టిలో  డిమాండ్ వున్న హీరోగా మారిపోయాడు . చలో సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టిన కన్నడ భామ రష్మిక  మండన్న  నాగ శౌర్య తో నటించింది . 3 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా 24 కోట్లకు పైగా వసూలు చేసిందట . ఈ చిత్రంలో నటించిన రష్మిక నటన కు ముగ్దుడైన పరశురామ్ విజయ దేవరకొండ ప్రక్కన ఎన్నిక చేశాడు . ఈ సినిమా రష్మిక కు పెద్ద టర్నింగ్ అయ్యింది . ఇక .గీత గోవిందం నిర్మాణంలో ఉండగానే నాగార్జున, నాని నటించిన దేవదాస్ సినిమాలో తీసుకున్నారు .

అయితే అంతకు ముందు స్టార్ డమ్ రాకముందు రష్మిక రక్షిత్ శెట్టి అనే సహా నటుడు ను ప్రేమించింది . ఇద్దరికీ ఎంగేజిమెంట్ కూడా జరిగింది . గీత గోవిందం సూపర్ హిట్ కావడం నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం రావడం తో రష్మిక ఆనందానికి అంతులేదు , వీటితో పాటు “డియర్ కామ్రేడ్ ” , “భీష్మ ” చిత్రాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి . ఈ రెండు చిత్రాలు నిర్మాణ దశలో వున్నాయి. ఇప్పుడు రష్మిక కు ప్రియుడు కన్నా  సినిమా ప్రాణమై పోయింది . అందుకే ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుందనే వార్తలు వచ్చాయి.సో గ్రామర్ తో ముడిపడే  జీవితం కన్నా గ్లామర్ తో వెలిగే   జీవితమే మిన్న
అనుకుంది .