`రంగ‌స్థ‌లం` టైపులో జాన‌ప‌ద గీత‌మా దేవీ?

అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిల్మ్ `పుష్ప‌`

`ఆ గట్టునుంటావా.. నాగన్న ఈ గట్టు కొస్తావా?`.. చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం చిత్రంలో జాన‌ప‌ద గీత‌మిది. ఈ పాట విజువ‌ల్ గానూ అదిరిపోయింది. అయితే సేమ్ టు సేమ్ మ‌రో జాన‌ప‌ద గీతాన్ని బ‌న్ని కోసం రెడీ చేస్తున్నాడా దేవీశ్రీ‌? అంటే .. అవున‌నే స‌మాచారం. వెస్ట్ర‌న్ స్టైల్ మ్యూజిక్ న‌డుమ ఇలాంటి జాన‌ప‌ద గీతాలు పెద్ద రిలీఫ్‌. పైగా స్థానిక జాన‌ప‌దుల‌కు ప‌ల్లెల‌కు మంచి క‌నెక్టివిటీని క‌లిగి ఉంటాయి కాబ‌ట్టి మూవీకి పెద్ద ప్ల‌స్ అవుతుంటాయి.

తాజాగా సెట్స్ కి వెళ్ల‌నున్న `పుష్ప‌` చిత్రం లో ఇలాంటి ఒక పాట ఉండాల‌ని సుకుమార్ భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే బ‌న్ని-సుక్కూ- దేవీ కాంబో అంటేనే మ్యూజికల్ హిట్ ఖాయ‌మ‌న్న టాక్ ఉంది. ఈ కాంబోలో సంచలనాత్మక సంగీత ఆల్బమ్ లు ఇంత‌కుముందు అల‌రించాయి. దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు అదే రిపీట్ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడ‌ట‌.

ప్ర‌స్తుత లాక్ డౌన్ వ్యవధిలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీకి తగినంత సమయం దొర‌క‌డంతో ఈ చిత్రం కోసం ప్రత్యేక జానపద గీతాన్ని డిజైన్ చేయాలని సుకుమార్ అభ్యర్థించాడ‌ట‌. బాలీవుడ్ బ్యూటీ ఈ స్పెషల్ నంబర్ లో డ్యాన్స్ చేస్తుంద‌ని తెలుస్తోంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ వ‌ల్ల షెడ్యూల్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.