రానా, రాజ్ తరణ్, అక్షయ్ కుమార్ కాంబో

రానా నిర్మాతగా, రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని రానా స్వయంగా మీడియాకు వెల్లడించాడు. రీసెంట్ గా ఒక కొత్త దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో అక్షయ్ కుమార్ తో కలిసి జాయింట్ ప్రొడక్షన్ లో ఆ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాను తెలుగు-హిందీ భాషలలో నిర్మిస్తారని చెప్తున్నారు. అందులో భాగంగా.. తెలుగు వెర్షన్ కోసం రాజ్ తరుణ్ ను ఎంపిక చేశారని సమాచారం. హిందీ వెర్షన్ కు హీరోను ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉందట. వేసవి తర్వాత ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్తారని తెలుస్తోంది.

ఇక అందుతున్న సమాచారం మేరకు… మరాఠీలో సూపర్ హిట్టయిన ‘పోస్టర్ బాయ్స్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారట. ఈ సినిమా ని తెలుగులో చేయటం గురించి చాన్నాళ్ల కిందటే ప్రకటన వచ్చింది కానీ.. ఎందుకనో గ్యాప్ వచ్చేసింది. అయితే రానా, అక్షయ్ ల మధ్య రీసెంట్ గానే ఓ ఒప్పందం కుదిరిందని, త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వాస్తవానికి రాజ్ తరుణ్ వరస ఫ్లాఫ్ ల్లో ఉన్నారు. అయితే అతని ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా అతడికి ఈ సినిమాలో అవకాశం కల్పించటం గొప్ప విషయమే అంటున్నారు.తెలుగులో రానా, హిందీకు అక్షయ్ నిర్మాతలుగా వ్యవహరించడమే కాదు..గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారట.