హీరోయిన్ కు అరుదైన వ్యాధి, ఫ్యాన్స్ ఆందోళన

ప్రముఖ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన అలియాస్‌ రమ్య గత కొద్ది రోజులుగా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. కన్నడ ప్రముఖ సినీ నటుడు అంబరీశ్‌ అంతిమ దర్శనానికి రాని రమ్య పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఈ విషయం బయిటకు వచ్చింది. రమ్య గైర్హాజర్‌కు సంబంధించి అనేక గాసిప్స్ వచ్చాయి. అయితే తన కాలుకు అరుదైన వ్యాధి సోకడంతోనే తాను అంబరీశ్‌ అంకుల్‌ అంత్యక్రియలకు రాలేదని, ఇందుకు తాను ఎంతో బాధపడుతున్నానని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక ఫోటో పోస్టు చేసి చెప్పారు.

ఇంతకీ ఆ వ్యాధేంటి..

రమ్య తాను ఆస్టియోకాల్‌యటోమా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు పోస్టు పెట్టింది. కాలులోని మూలగకు సంబంధించిన వ్యాధి ఇది. నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. దీంతో ఆమె అక్టోబర్‌ నుంచి విశ్రాంతిలో ఉంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాలుకు ఆపరేషన్ ఫొటోను కూడా పోస్టు చేసారు.

ఇక ఆస్టియోకాల్‌యటోమా అనేది చాలా అరుదైన వ్యాధి . పది లక్షల మందిలో ఒక్కరికి ఈ వ్యాధి వస్తుంది. ఎముక ములగుల్లో బాధ విపరీతంగా ఉండటంతో నడిచేందుకు సాధ్యం కాదు. ఈ వ్యాధికి చికిత్స లేదు, ఆపరేషన్‌ తప్పదని డాక్టర్లు తెలియజేస్తున్నారు. దివ్య స్పందన కన్నడ చిత్ర పరిశ్రమలో రమ్యగా ఎదగి అంబరీశ్‌ ఆశీర్వాదంతో ఎంపీ అయ్యారు.

దాంతో అంబరీశ్‌ అంతిమ దర్శనానికి రాకపోవడంతో అంబీ అభిమానుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది, సోషల్‌ మీడియాల్లో వస్తున్న పోస్టులను చూసిన రమ్య తన గైర్హాజరుకు సంబంధించి స్పష్టత ఇస్తూ ఈ విషయం బయిటపెట్టారు.