‘నా కొడుకు లోకేష్‌ మీద ఒట్టేసి చెపుతున్నా’

ఎన్టీఆర్‌ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఇప్పటికే సంచలనాలకు కేంద్ర బింధువుగా మారిన ఈ సినిమా ప్రమోషన్‌ విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసందే. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రంకు సంబంధించి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.

తొలి ట్రైలర్‌లో ఎన్టీఆర్‌కు జరిగిన అవమానాలను చూపించిన వర్మ తాజా ట్రైలర్‌లో లక్ష్మీ పార్వతి ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాల మీద దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్‌కు దగ్గరైన తరువాత లక్ష్మీ పార్వతిని.. ఎన్టీఆర్‌ కుటుంబం సభ్యులు ఎలా అవమానించారు, ఆమె మీద ఎలాంటి విష ప్రచారం చేశారు అన్న విషయాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ‘వాడూ నా పిల్లలూ కలిసి, నన్ను చంపేశారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభించిన వర్మ తరువాత ఎన్టీఆర్ వెన్నుపోటు కారణమైన పరిణామాలను చూపించాడు.

Lakshmi's NTR Movie Trailer 2 | NTR True STORY | RGV | Yagna Shetty | Kalyani Malik | Agasthya Manju

లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్‌ నుంచి దూరం చేయడానికి ఎలాంటి కుట్రలు జరిగాయన్న విషయాలను ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. తన సోషల్‌ మీడియా పేజ్‌లో ట్రైలర్‌ రిలీజ్ చేసిన వర్మ ‘ఇది స్వర్గం నుంచి ఎన్టీఆర్ విసిరిన లక్ష్మీ ఆటం బాంబ్’ అంటూ ట్వీట్ చేశారు.

బిజినెస్ విషయానికి వస్తే..‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సంబందించి గమనిక లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న రక రకాల వార్తల్లో నిజాలు లేవు …ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు Gv films , RGV మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు’ అంటూ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మార్చి 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్‌లో చూపించని ఎన్నో ఈ నిజాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆడియన్స్‌.