జిమ్ ట్రైనింగ్ సెంట‌ర్ పై రకుల్ ఆసక్తి!?

జిమ్ ట్రైనింగ్ సెంట‌ర్ పై రకుల్ ఆసక్తి!?
 
ర‌కుల్‌ప్రీత్ సింగ్ సినిమాలే కాకుండా ప్ర‌త్యామ్నాయ వ్యాపారాల్లో కూడా ఉన్న‌విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ లో సొంతంగా జిమ్ ట్రైనింగ్ సెంట‌ర్ ను నిర్వ‌హిస్తోంది. మ‌రోవైపు వైజాగ్ లో కూడా ఫిట్ నెస్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసుకుంది. హైద‌రాబాద్ లో రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డులు కూడా పెట్టింద‌ట‌. క‌రోనా ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో కొనుగోలు చేసిన ల‌గ్జ‌రీ అపార్టుమెంట్ కు మ‌కాం మార్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో చెప్పుకుంటున్నారు..
 
ఓటీటీలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో సినిమా ఇండస్ట్రీ దృష్టి ఇప్పుడు వాటిపై పడింది. అందుకే స్టార్‌ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు, పేరున్న నిర్మాణ సంస్థలు సైతం డిజిటల్‌ వేదికవైపు అడుగులేస్తున్నారు. సమంత, తమన్నా, కాజల్‌ అగర్వాల్‌ వంటి స్టార్‌ హీరోయిన్లు ఇప్పటికే వెబ్‌ సిరీస్ లో చేస్తూ న్నారు. ఈ జాబితాలోకి తాజాగా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చేరుతోందట.
 
ఆమె ఓ వెబ్‌ సీరీస్‌లో నటించేందుకు ఓకే అందట. ఇందులో రకుల్‌ ద్విపాత్రాభినయం చేయనుందట. అది కూడా కవలలుగా నటించనున్నారని..వారు ప్రతి విషయంలోనూ నువ్వా? నేనా? అన్నట్టు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారని, ఆ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయని తెలుస్తోంది‌. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ ‌డబుల్‌ రోల్‌ చేయని రకుల్ రెండు పాత్రల్లో కనువిందు చేయనుండడం విశేషం.