రాజమౌళి, మహేష్ సినిమా కోసం.. ! 

Rajamouli and Mahesh  movie latest update
rajamouli-maheshbabu

 

నేషనల్ లెవల్లో దర్శక ధీరుడు అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తరువాత రాజమౌళి డైరెక్షన్ లో  రాబోతున్న  అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో ఫుల్ అంచనాలు ఉన్నాయి. అయితే రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో  చేస్తున్నాడని.. ఎప్పుడైతే జక్కన్న క్లారిటీ ఇచ్చాడో.. ఇక అప్పటి నుండి ఈ సినిమా పై అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అవేవి నిజం కాదని తెలిసినా.. రూమర్స్ ఆగడం లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేకపోయినా.. రాజమౌళి, మహేష్ సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడట.

అప్పుడే మహేష్ సినిమా పై వర్క్ చేయడానికి కారణం రాజమౌళి టైం వేస్ట్ చేయకూడదనే. ఎందుకంటే కరోనా దెబ్బకు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్లానింగ్ మొత్తం రివర్స్ అయిపోయింది. అటు మహేష్ ది కూడా అదే పరిస్థితి అయ్యే. అయితే ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ మొదలైన నాలుగు నెలల్లో ఈ సినిమా పూర్తయిపోతుందట. ఆ తరువాత రాజమౌళి సినిమా చేసే అవకాశం ఉంటే చేసేయాలని మహేష్ ప్లాన్. కానీ, రాజమౌళితో కుదరకపోతే వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడట. నిజానికి ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు మహేష్ కే క్లారిటీ లేకపాయే. ఒకపక్క వంశీ పైడిపల్లికి మహేష్ సినిమా చేస్తానని చెప్పాడట. దాంతో వంశీ పైడిప‌ల్లి ఇంకా స్క్రిప్ట్‌ని చెక్కే  పనిలోనే ఉన్నాడు.

మ‌రోవైపు పరశురామ్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడానికి బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నాడు. పైగా ఈ కథ మహేష్ కి బాగా నచ్చింది. క‌రోనా వ‌చ్చి లాక్‌డౌన్ కారంణంగా సినీ పరిశ్ర‌మ మొత్తం ష‌ట్‌డౌన్ అవ్వకపోయి ఉండి ఉంటే.. ఈ పాటికి సగం షూట్ కూడా అయిపోయి ఉండేది. కానీ ఏం చేస్తాం.. కరోనా దెబ్బకు ఎక్క‌డి సినిమాలు అక్క‌డే ఆగిపోయాయి. వాటిలో మహేష్ సినిమా కూడా ఉందయ్యే. మొత్తానికి దీంతో ఎలాగూ గ్యాప్ వ‌చ్చింది క‌నుక పరుశురామ్ తో సినిమా తరువాత,
మహేష్ కొన్ని రోజులు వెయిట్ చేసైనా.. రాజ‌మౌళితోనే సినిమాను స్టార్ట్ చేయాలని ఇది మహేష్ ప్లాన్ అని తెలుస్తోంది.