ఇది డిజిటల్ యుగం తెచ్చిన గుర్తింపు..!
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పూరి హీరో అనగానే… ఎవరా హీరో అనుకుంటున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. `రోగ్` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతో ఆశించిన విజయం దక్కకపోయినా.. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో ఇషాన్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన రోగ్ సినిమాతో ఇషాన్ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. సి.ఆర్.మనోహర్ నిర్మించిన ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యింది.. అయితే ఫ్యామిలీ ఆడియెన్ నిరాదరణ నిరాశపరిచింది. పూరి శైలి మసాలా హీరోగా ఇషాన్ బాగానే నటించినా ఫ్లాప్ టాక్ ఇబ్బంది పెట్టింది.
ఇషాన్, మన్నారా చోప్రా జంటగా నటించిన రోగ్ సినిమా మార్చి 31న 2017లో రిలీజైంది. రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసారు. ఒక్క రోజులోనే ఈ సినిమాకి 40లక్షల (4 మిలియన్) వ్యూస్ సాధించడం విశేషం. ఈ విధంగా ఇషాన్ డిజిటల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెమో అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి నోటా ఫేం పవన్ వాడియర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో `గుండెజారి గల్లంతయ్యిందే` డైరెక్టర్ విజయ్ కుమార్ కొండాతో ఓ సినిమా చేస్తున్నాడు. మరి.. ఈ రెండు సినిమాలతో ఇషాన్ సక్సస్ సాధిస్తాడా లేదా? అన్నది చూడాలి.
