టాలీవుడ్ పవర్ స్టార్, సూపర్ స్టార్ సినిమాలపై నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక గత కొన్నేళ్లుగా ఈ కాంబినేషన్లో సినిమా రానున్నట్లు కూడా అనేక రకాల కథనాలు అభిమానుల్లో ఆశలను కలిగిస్తున్నాయి. అయితే ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఈ కాంబోపై చిన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. జల్సా సినిమాలో అప్పుడెప్పుడో మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి హైప్ క్రియేట్ చేశాడు. ఇక మళ్ళీ వారిద్దరు ఒక్కసారి కూడా కలవలేదు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఈకాంబోలో ఒక సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు మరొక రూమర్ కూడా వైరల్ గా మారింది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక చిన్న అతిధి పాత్ర చేసే అవకాశం ఉందట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది.
ఇప్పటివరకైతే సర్కారు వారి పాటలో గెస్ట్ రోల్స్ ఉండబోతున్నాయని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. సీనియర్ హీరోలను మాత్రం నెగిటివ్ పాత్రల్లో చూపించే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే గట్టిగా వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే హేటర్స్ కుళ్ళుకోవాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
