బ్రేకింగ్ :ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

అవును …యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ఓ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఇంతకీ ఏమిటా సినిమా అంటారా..మిస్టర్ మజ్ను. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 19న జెఆర్ సి కన్వెన్షన్ హాల్, హైదరాబాద్ లో జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో మార్కెట్ లోకి విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావటానికి కారణం నిర్మాత బివియస్ ప్రసాద్ కుమారుడు బాపినీడు కు , ఎన్టీఆర్ కు ఉన్న స్నేహమే అని తెలుస్తోంది. ఇదే బ్యానర్ లో గతంలో ఎన్టీఆర్..నాన్నకు ప్రేమతో చిత్రం చేసిన సంగతి తెలిసిందే.

మిస్టర్ మజ్ను విషయాలకి వస్తే… అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. ఈ సినిమాకు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 25న విడుదల చేయబోతున్నారు.

నిర్మాత మాట్లాడుతూ…ఇది యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ కథాంశంతో తెరకెక్కిందన్నారు. ఈ సినిమాలో మిస్టర్ మజ్ను ఎవరు? మజ్ను ఎలా తన ప్రేమకథకు ఏర్పడ్డ అవరోధాలు అధిగమించి, తన ప్రేమను గెలిచాడు? వంటి కథనాలతో ఆకట్టుకుంటుందన్నారు. సినిమాలో ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని, ఈ సినిమాలో అఖిల్ పాత్ర స్టెలిష్‌గా వుంటుందన్నారు.
వినూత్నమైన కథాంశంతో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించారని, అంతేకాకుండా తమన్ సంగీతం కూడా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో కె. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది తదితరులు మిగితా పాత్రల్లో నటిస్తున్నారు.