సీన్ లోకి నాగశౌర్య…సమంత అసలు అలోచన ఇదే ?

హీరోలతో సమానంగా  స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ తెచ్చుకుంది. సమంత నటించే సినిమాకు ఓపినింగ్స్  …ఆమె అభిమానుల ద్వారా కూడా వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమంత ప్రధాన పాత్రలో సినిమాలు చేయటానికి దర్శక,నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. తమిళంలో నయనతార మాదిరిగా ఇక్కడ కూడా సమంత తనకంటూ ప్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుని సినిమాలు చేస్తోంది.

అయితే అలాంటి సినిమాల్లో హీరోలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు.  అందుకేనేమో ఇప్పుడు సమంత సినిమాలో  హీరోగా నాగశౌర్య ని ఎంపిక చేసారు. నాగశౌర్య రీసెంట్ చిత్రం నర్తన శాల పెద్దగా ఆడలేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమా కమిటవ్వటంతో …అంతా ఆసక్తిగా ఈ పరిణామాలను గమనిస్తున్నారు. నాగశౌర్య పాత్ర ఎంత వరకూ ప్రాధాన్యత ఉండబోతోంది…సమంత డామినేషన్ తో కథ నడిచే చిత్రంతో నాగశౌర్య హీరోయిజం
ఏముంటుంది అంటున్నారు. అయితే విభిన్నమైన పాత్ర కావటంతో ఒప్పుకున్నట్లు సమాచారం.

 
వివరాల్లోకి వెళితే… సమంత కోసం దర్శకురాలు నందినిరెడ్డి ఓ కథ సిద్ధం చేశారని సమాచారం. ఇది హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రంగా తెలుస్తోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. 

కాగా ఈ సినిమాలో   నాగశౌర్య కీలక పాత్ర పోషించనున్నారని తాజా సమాచారం. ఈ మేరకు నందినిరెడ్డి ఆయన్ని సంప్రదించినట్లు తెలిసింది. పాత్ర నచ్చి ఆయన కూడా ఓకే చెప్పారట. నాగశౌర్య తన కెరీర్‌లో హిట్‌గా నిలిచిన ‘కల్యాణ వైభోగమే’ సినిమా కోసం నందినిరెడ్డితో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.

సమంత నటించిన ‘జబర్‌దస్త్‌’కు ఆమే దర్శకత్వం వహించారు. దక్షిణ కొరియాలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘మిస్‌ గ్రానీ’కు తెలుగు రీమేక్‌ ఈ చిత్రం. ఇందులో సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనున్నట్లు సమాచారం.