గురూజీని లాక్ చేసి పూరి చెప్పిందే నిజం చేశాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌క్సెస్ ఉన్న ద‌ర్శ‌కుల వెంట ప‌డ‌తాడ‌ని పూరి అంత‌టివాడే సెల‌విచ్చారు. అది వాస్త‌వ‌మేనా? అంటే ఇటీవ‌ల త‌న ఎంపిక‌లే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ప్ల‌స్ స‌క్సెస్ రెండూ ఉంటే మ‌హేష్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇస్తున్నారు. ఇటీవ‌ల ప‌ర‌శురామ్ ఆ కోవ‌లోనే అవ‌కాశం అందుకున్నాడు. అప్ప‌టివ‌ర‌కూ చిన్న హీరోల‌తో ప‌రిమిత‌ బడ్జెట్ సినిమాలు తీసిన‌ ప‌ర‌శురాం మ‌హేష్ పిలుపుతో ఒక్క సారిగా హాట్ టాపిక్ అయ్యాడు. ప్ర‌స్తుత లాక్ డౌన్ అనంతం ఈ కాంబినేష‌న్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఇక స‌క్సెస్ లేక‌పోతే మ‌హేష్ ద‌రి చేర‌నియ్య‌రు అన‌డానికి సాక్ష్యం క‌నిపిస్తోంది.

గ‌తంలో ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇచ్చిన పూరి జ‌గ‌న్నాథ్ కి.. అలాగే క్లాసిక్ మూవీని ఇచ్చిన‌ వంశీ పైడిప‌ల్లికి మ‌హేష్ ఎలా హ్యాండ్ ఇచ్చాడో తెలిసిందే. వాస్త‌వానికి మ‌హేష్ ని స్టార్ గా నిల‌బెట్టింది పూరి సినిమాలే. కానీ అంత‌టి వాడినే ప‌క్క‌న‌పెట్టేయ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌కొచ్చింది. కొన్నాళ్ల పాటు బాధంతా మ‌న‌సులోనే దిగ‌మింగినా చివ‌రికి పూరి బ‌ర‌స్ట్ అవ్వ‌డంతో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. అటుపైనా మ‌హ‌ర్షి లాంటి క్లాసిక్ హిట్ ని ఇచ్చినా.. వంశీ పైడిప‌ల్లిని ఊరించి చివ‌రిగా ఎలా స్కిప్ చేసాడో తెలిసిందే. ఇక త్రివిక్ర‌మ్ అప్ప‌ట్లో మ‌హేష్ తో సినిమాలు చేయ‌డానికి ట్రై చేసాడు. కానీ అత‌ని టైమ్ అప్ప‌టికీ బ్యాడ్ ఫేజ్ లో ఉండ‌టంతో ఛాన్స్ ఇవ్వ‌కుండా ముఖం చాటేశాడు. ఇవ‌న్నీ పూరి విసిరిన పంచ్ ని స‌మ‌ర్థించాయి.

తాజాగా మ‌హేష్ వెట‌ర‌న్స్ కి తిరిగి ఛాన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్ప‌టికే ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో.. నేరుగా పూరీతో న‌మ్ర‌త మంత‌నాలు సాగిస్తోంద‌ని వార్త‌లొస్తున్నాయి. న‌మ్ర‌త సీక్రెట్ మీటింగ్ పైనా గుస‌గుస‌లు వినిపించాయి. అయితే పూరి జ‌న‌గ‌న‌మ‌న చిత్రాన్ని మ‌హేష్ తో తీస్తాడా? అన్న స‌స్పెన్స్ అలానే ఉందింకా. అలాగే గురూజీ త్రివిక్ర‌మ్ తోనూ మ‌హేష్ – న‌మ్ర‌త బృందం చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ట‌. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌.. అల వైకుంఠ‌పుర‌ములో అనే రెండు స‌క్సెస్ ల‌తో ఫామ్ లోకి వ‌చ్చిన గురూజీ త్రివిక్ర‌మ్ కి ఈసారి ఆఫ‌ర్ త‌గిలింద‌ట‌. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను సాధించాయి. దీంతో మ‌హేష్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తో సినిమా చేయ‌డానికి రాయ‌బారం నెర‌పుతున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. నేరుగా త్రివిక్ర‌మ్ ని క‌ల‌వ‌కుండా అత‌ని ఆస్థాన నిర్మాత రాధాకృష్ణ‌ను మ‌హేష్ వ్య‌క్తిగ‌తంగా క‌లిసిన‌ట్లు స‌మాచారం. దీంతో ఫ్లాపుల్లో దూరం పెట్టి స‌క్సెస్ వ‌చ్చాక ఇలా చేస్తాడా అంటూ మ‌హేష్ పై ఓ సెక్ష‌న్ సోష‌ల్ మీడియాల్లో విసుర్లు విస‌ర‌డం చ‌ర్చ‌కొచ్చింది.