ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో చీవాట్లు తిని ఇప్పుడేమిటిలా?

సోష‌ల్ మీడియా- డిజిట‌ల్ యుగంలో ఏదైనా సాధ్య‌మే. త‌మ‌ను మ‌ర్చిపోయిన వాళ్లంతా తిరిగి గుర్తు చేసుకోవాలంటే ఈ మాధ్య‌మాల్లోకి వ‌చ్చి ఏదో ఒక గొడ‌వ పెట్టుకుని ర‌చ్చ చేస్తే చాలు. వెంట‌నే ఈజీగా గుర్తుకు తెచ్చేసుకుంటున్నారు అభిమానులు. శ‌త‌కోటి విద్య‌ల్లో ఇదోర‌కం ద‌రిద్ర‌పు విద్య అనే చెప్పాలి. వివాదాలు.. గొడ‌వ‌ల‌తో పాపులారిటీ పెంచుకోవ‌డం అనే ప‌నికి మాలిన ఆలోచ‌న చాలామంది సెల‌బ్రిటీల‌కు దాపురించ‌డం మ‌రీ విడ్డూరంగా ఉంది. ఆర్జీవీ మొదలు ఆయ‌న‌ను ఇమ్మిటేట్ చేసే శిష్య‌గ‌ణం ఇదే పంథాలో వెళుతున్నారు.

మొన్న‌టికి మొన్న వ‌ర్మ‌లానే పిలిచి గిల్లిక‌జ్జాలు ఆడింది మీరా చోప్రా. అస‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎవ‌రో తెలీదు అంటూ నంద‌మూరి ఫ్యాన్స్ ని కెలికిన ఈ అమ్మ‌డు అటుపై సోష‌ల్ మీడియాల్లో చీవాట్లు తింది. అటుపైనా మంత్రి కేటీఆర్ కే ఎన్టీఆర్ అభిమానుల‌పై ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతం త‌న‌ను బ్యాడ్ చేసినా.. లైమ్ లైట్ లోకి తెచ్చింది. ఎన్టీఆర్ అభిమానులు టూమ్ చ్ గా బూతులు తిట్టేయ‌డం స‌రికాదు కానీ.. ఫ్యాన్స్ చెల‌రేగ‌డంతో తార‌క్ కి అది ఇబ్బందిక‌రంగా మారింది. ఇక మీరా ఇంత చేసినా ఈ అమ్మ‌డిని పిలిచి అవ‌కాశాలిచ్చేవాళ్లు అయితే ఎవ‌రూ లేరు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న బంగారం చిత్రంలో న‌టించిన మీరా చోప్రా ఆ త‌ర్వాత తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో పెద్దంత‌గా వెల‌గ‌నే లేదు. అటుపై ముంబై ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిపోయింది. అక్క‌డా ప‌ప్పులుడ‌క‌లేదు. ఆ క్ర‌మంలోనే ప‌లు వివాదాల్లో ఇరుక్కుని టూ బ్యాడ్ అయిపోయింది. మ‌రోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పెట్టుకుని బ్యాడ్ అనిపించుకుంది. ఎక్క‌డా త‌న గురించి గుడ్ అన్న మాటే వినిపించ‌లేదు.

ఇదిగో ఇప్పుడిలా సోష‌ల్ మీడియాల్లో లోదుస్తుల‌తో అందాలు ఆర‌బోసి వాటిని సెల్పీలు తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసి మ‌రోర‌కం ప్ర‌చారానికి దిగ‌డంతో నెటిజ‌నులు మ‌ళ్లీ త‌మ‌దైన శైలిలో చెల‌రేగుతున్నారు. ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.