‘మన్మధుడు 2’ ప్రీ రిలీజ్ బిసినెస్ (ఏరియావైజ్)

‘మన్మధుడు 2’ ప్రీ రిలీజ్ బిసినెస్ (ఏరియావైజ్)

నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు గా న‌టించిన రొమాంటిక్ కామెడీ చిత్రం `మ‌న్మథుడు 2` . రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానున్న ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మధ్యకాలంలో నాగ్ చేసిన ఏ సినిమాకు రానంత క్రేజ్ వచ్చింది. ట్రైలర్స్, పోస్టర్స్ తో పాటు చిత్ర యూనిట్ విరివిగా ప్రమోషన్స్ నిర్వహించడంతో ప్రీ రీలీజ్ బిజినెస్ బాగా జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. నాగార్జున గత చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే ఈ సినిమాకు జరిగిన బిజినెస్ ఎక్కువే అని ట్రేడ్ లో చెప్తున్నారు.. దీనితో చిత్ర దర్శక నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

నైజాం: 7 కోట్లు
సీడెడ్: 2.5 కోట్లు
ఆంద్రా: 7 కోట్లు

ఆంధ్రా మరియు తెలంగాణా: 16.5 కోట్లు
భారత్ లో మిగతా ప్రాంతాలు: 1.60 కోట్లు
ఓవర్ సీస్: 2.40కోట్లు
మొత్తం: 20,50 కోట్లు

అలాగే ఈ చిత్ర డిజిటిల్ రైట్స్‌ను ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ 7.4 కోట్లకు కొనేసింది.హిందీ డబ్బింగ్ రైట్స్‌ 6 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకోగా శాటిలైట్‌ రైట్స్‌ కూడా భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో కూడా మన్మధుడు 2 చిత్రానికి మంచి ధర పలికిందని సమాచారం.

రావు రమేష్,వెన్నెల కిషోర్,ఝాన్సీ, లక్ష్మీ వంటి నటులు ముఖ్యపాత్రాలలో కనిపిస్తుండగా, కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాల పై నాగార్జున అక్కినేని, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.