బన్నీ కొత్త చిత్రంలో మళయాళ హీరో కీ రోల్

అల్లు అర్జున్ కు మొదటి నుంచీ మళయాళంలో మంచి మార్కెట్ ఉంది. దాంతో తెలుగుతో సమానంగా కేరళ కూడా ఆయన సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కేరళ మార్కెట్ ని మరింత విస్తరించేందుకు ..అక్కడ వారికి లోకల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చిందుకు కాను మళయాళ నటులను తన సినిమాల్లో తీసుకోవాలని బన్ని ఫిక్సైనట్లు సమాచారం.

అంతెందుకు ఆ మధ్యన ప్రియా వారియర్ సినిమా లవర్స్ డే కు సైతం అల్లు అర్జున్ ప్రమోషన్ చేసి పెట్టారు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ తో చేస్తున్న తన కొత్త చిత్రంలో మళయాళ నటుడు జయరామ్ కు అవకాసం ఇస్తున్నట్లు సమాచారం. ఆయన్ని ఓ కీరోల్ లో సినిమాకు ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో శనివారం ఉదయం నిర్వహించారు.ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించబోతున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. తమన్‌ బాణీలు సమకూరుస్తున్నారు.

అల్లు అర్జున్ గత ఏడాది సెప్టెంబరులో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్‌ అందుకోలేకపోయింది. జనవరిలో బన్నీ.. త్రివిక్రమ్‌ ప్రాజెక్టును ప్రకటించారు. తర్వాత ఆయన ‘ఐకాన్‌: కనబడుట లేదు’ అనే సినిమాలో నటించనున్నారు. దీనికి శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించబోతున్నారు. మరోపక్క సుకుమార్‌ దర్శకత్వంలోనూ బన్నీ నటించనున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ పాత్ర పోషించబోతున్నారు.